మోడీ జీ.. హిమంతను నమ్మకండి, గతంలో రాహుల్ను పొగిడారు, ఇప్పుడు విమర్శలు: కాంగ్రెస్
పార్టీలు మారితే విమర్శలు సహాజమే.. ఇవాళ ఒక పార్టీలో ఉండి.. రేపు మరో పార్టీలో చేరేవారు చాలా మంది ఉన్నారు. అయితే అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ.. 2015లోనే కాంగ్రెస్ పార్టీ వీడారు. బీజేపీలో చేరి.. ఇప్పుడు అసోం సీఎంగా ఉన్నారు. ఇటీవల రాహుల్ గాంధీని శర్మ కామెంట్ చేశారు. ఓ ఫన్నీ వీడియోను ట్వీట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. గతంలో రాహుల్ గాంీని పొగిడిన ట్వీట్ను యాడ్ చేసి.. ప్రధాని మోడీకి ట్వీట్ చేసింది.
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ఏదో ఒకరోజు దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని కామెంట్ చేశారు. ఆ ట్వీట్ను కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ రీ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడుతున్న క్రమంలో.. బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. హిమంత కూడా అదేవిధంగా విరుచుకుపడుతున్నారు. దీంతో వీడియో ట్వీట్ చేయగా.. గంటల్లోనే ఠాగూర్ ట్వీట్ చేశారు.
Dear @narendramodi ji
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) September 9, 2022
Whom @himantabiswa cheating?
His tracked record shows ..
beware of him .
I know you won’t allow him to cheat .
Regards pic.twitter.com/3IkCAthfkN
2010లో హిమంత రాహుల్ గాంధీని పొగిడారని గుర్తుచేశారు. మోడీ జీ మీరు హిమంతను విశ్వసించకండి అని కోరారు. అతను మిమ్మల్ని కూడా మోసం చేయగలడు అని అన్నారు. కానీ మీరు అతని ట్రాక్లో పడరని అనుకుంటున్న అని కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి హిమంత శర్మ.. రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల భారత్ జోడో యాత్రను కామెడీ ఆఫ్ ద సెంచరీ అని కామెంట్ చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా అలాగే స్పందిస్తున్నాయి.

రాహుల్ గాంధీ యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గుండా సాగనుంది. అయితే నిన్న అతని టీ షర్ట్పై కూడా వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications