సోనియాకు షాక్: అస్సాం సిఎం గోగోయ్ రాజీనామా
న్యూఢిల్లీ: అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన రేపు గురువారం రాజీనామా చేయనున్నారు. లోకసభ ఎన్నికల్లో అస్సాంలో కాంగ్రెసు పార్టీ తగిన ఫలితాలు సాధించడంలో విఫలమైనందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పిస్తారు .
సోనియాను కలిసి రాజీనామా లేఖను సమర్పించి, తన భవిష్యత్తను నిర్దేశించాలని కోరడానికి ఆయన మంగళవారంనాడే ఢిల్లీ వచ్చారు. లోకసభ ఎన్నికల్లో ఫలితాలు సాధించడంలో విఫలమైన నేపథ్యంలో గోగోయ్ని మార్చాలనే డిమాండ్ మరోసారి పెచ్చరిల్లింది.

అస్సాంలో కాంగ్రెసు కేవలం మూడు సీట్లను మాత్రమే గెలుచుకుంది. నాయకత్వ మార్పునకు తిరుగుబాటు మంత్రులు, శాసనసభ్యులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాన్ని ఎదుర్కోవడానికి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని తరుణ్ గోగోయ్ అనుకూల వర్గం సూచిస్తోంది.
మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకుని, కొత్తవారితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని వారంటున్నారు. 2016 శానససభ ఎన్నికలకు ముందే కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని వారంటున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications