చమురు బావిలో భారీగా ఎగిసిన మంటలు: ముగ్గురు విదేశీ నిపుణులకు గాయాలు

గౌహతి: అస్సాంలోని తిన్సుకియా జిల్లా బాఘ్జన్‌లో ఆయిల్ ఇండియా సంస్థ(ఓఐఎల్) చమురు బావిలో తాజాగా మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు విదేశీ నిపుణులు గాయపడినట్లు కంపెనీ సీనియర్ మేనేజర్ జయంత బర్ముడోయి వెల్లడించారు.

కాగా, గత నెల రోజుల నుంచి ఈ బావిలో తరచూ మంటలు ఎగిసిపడుతుండటం గమనార్హం. ఈ మంటలను అదుపులో చేసే క్రమంలోనే ముగ్గురు విదేశీ నిపుణులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Assam: Huge explosion near Baghjan oil well, 3 foreign experts injured

మే 28 నుంచి ఈ చమురు బావిలో గ్యాస్ లీకవుతోంది. కాగా, జూన్ 9 నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలను అదుపులో చేసే ప్రయత్నంలో ఇప్పటికే ఇద్దరు ఫైరింజిన్ సిబ్బంది మరణించారు .

Recommended Video

    Bhutan కూడా India పై కయ్యానికి దిగితే? 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నదీ జలాల అడ్డగింత ఎవరి పని ?

    ఈ క్రమంలో విదేశాల నుంచి నిపుణులను రప్పించి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ ప్రయత్నం కూడా తాజా ప్రమాదంతో తాత్కాలికంగా నిలిపివేశారు. గ్యాస్ లీకవడం ,మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో పరిసర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+