చమురు బావిలో భారీగా ఎగిసిన మంటలు: ముగ్గురు విదేశీ నిపుణులకు గాయాలు
గౌహతి: అస్సాంలోని తిన్సుకియా జిల్లా బాఘ్జన్లో ఆయిల్ ఇండియా సంస్థ(ఓఐఎల్) చమురు బావిలో తాజాగా మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు విదేశీ నిపుణులు గాయపడినట్లు కంపెనీ సీనియర్ మేనేజర్ జయంత బర్ముడోయి వెల్లడించారు.
కాగా, గత నెల రోజుల నుంచి ఈ బావిలో తరచూ మంటలు ఎగిసిపడుతుండటం గమనార్హం. ఈ మంటలను అదుపులో చేసే క్రమంలోనే ముగ్గురు విదేశీ నిపుణులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

మే 28 నుంచి ఈ చమురు బావిలో గ్యాస్ లీకవుతోంది. కాగా, జూన్ 9 నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలను అదుపులో చేసే ప్రయత్నంలో ఇప్పటికే ఇద్దరు ఫైరింజిన్ సిబ్బంది మరణించారు .
Recommended Video
ఈ క్రమంలో విదేశాల నుంచి నిపుణులను రప్పించి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ ప్రయత్నం కూడా తాజా ప్రమాదంతో తాత్కాలికంగా నిలిపివేశారు. గ్యాస్ లీకవడం ,మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో పరిసర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications