అస్సోంలో అత్యధికంగా 42శాతం..అనంతనాగ్లో అత్యల్పంగా 4.72శాతం పోలింగ్ నమోదు
దేశంలో మూడో విడత ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ మందకొడిగా సాగుతుండగా మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఓటర్లు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి అస్సోంలో అత్యధికంగా 42.35శాతం పోలింగ్ నమోదు కాగా... అత్యల్పంగా జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ నియోజకవర్గంలో 4.72శాతం నమోదైంది.
ఓటింగ్ ప్రారంభమైన ఆరుగంటల తర్వాత కూడా ఒడిషాలో పోలింగ్ శాతం పుంజుకోకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఒడిషాలో 22.70శాతం పోలింగ్ నమోదు అయ్యింది. కేరళలో 28.78శాతం నమోదుకాగా బీహార్లో 25.65శాతం పోలింగ్ నమోదైంది. మొత్తానికి ఇప్పటి వరకు జరిగిన పోలింగ్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు సమాచారం రాలేదని ఎన్నికల సంఘం తెలిపింది,

మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి:
గోవా: 25.65 %
గుజరాత్ : 25.50%
కర్నాటక : 22.77 %
మహారాష్ట్ర : 18.21 %
త్రిపురా : 29.54 %
ఉత్తర్ ప్రదేశ్ : 22.90 %
పశ్చిమ బెంగాల్ : 35.39 %
చత్తీస్గఢ్ : 29.48%
దాద్రా నరగ్ హవేలి: 21.62 %
డామన్ డియు: 23.93 %












Click it and Unblock the Notifications