కరుణానిధి మృతి, రాళ్ల వర్షం, 80 కేసులు, మెరీనా బీచ్ లో తొక్కిసలాట, వీవీఐపీలు!
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ చీఫ్, కలైంజ్ఞర్ డాక్టర్ ఎం. కరుణానిధి ఆకస్మిక మృతిని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు ఆ రాష్ట్రంలో హింస చోటుచేసుకుంది.
Recommended Video
కరుణానిధి మరణించారని, బంద్ చెయ్యాలని కొందరు రాళ్ల దాడులకు పాల్పడటంతో పోలీసులు ఇప్పటి వరకూ దాదాపు 80 కేసులు నమోదు చేశారు. చెన్నై నగరంలోని మెరీనా బీచ్ లో పెరియార్ స్మారకం సమీపంలో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహిస్తారని బుధవారం డీఎంకే కార్యకర్తలు తెలుసుకున్నారు.
కరుణానిధి అంత్యక్రియలు చూడటానికి ఇప్పటి నుంచి డీఎంకే కార్యకర్తలు మెరీనా బీచ్ లోని పెరియార్ స్మారకం దగ్గరకు పరుగు తీశారు. ఒక్కసారిగా వేలాధి మంది కార్యకర్తలు మెరీనా బీచ్ లోకి రావడంతో తొక్కిసలాట జరిగింది.
ఈ తొక్కిసలాటలో అనేక మందికి తీవ్రగాయాలైనాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులోని అనేక జిల్లాల నుంచి డీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే చెన్నై చేరుకున్నారు.
కరుణానిధికి అంతిమ వీడ్కోలు పలకడానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహ కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వీవీఐపీలు చెన్నై చేరుకోవడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతియుతంగా ఉండాలని కరుణానిధి కుటుంబ సభ్యులు డీఎంకే కార్యకర్తలకు పదేపదే మనవి చేస్తున్నారు.