ఎటిఎం సెంటర్ల నుండి నకిలీ నోట్లు, ఖంగుతిన్న ఖాతాదారులు
కాన్పూర్: ఎటిఎం మెషిన్ల నుండి నకిలీ నోట్లు రావడంతో కష్టమర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నకిలీ నోట్లతో తాము ఇబ్బందులు పడుతున్నామని కష్టమర్లు ఆవేదన చెందుతున్నారు. తమకు నోట్లను మార్చి ఇవ్వాలని కోరుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ఏటీఎం మెషీన్ల నుండి నకిలీ నోట్లు రావడంతో ఖాతాదారులు ఖంగుతింటున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లోని పలు ఏటీఎం మెషిన్ల నుండి నకిలీ నోట్లు రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక మార్బుల్ మార్కెట్లో ఉన్న ఓ యాక్సిస్ బ్యాంకు ఏటీఎమ్ నుంచి ఆదివారం ఉదయం ఇద్దరు వ్యక్తులు నగదు విత్డ్రా చేశారు. అయితే అందులో నుండి నకిలీ రూ 500 నోట్లు రావడంతో ఖాతాదారుల ఆందోళన చెందారు.

ఆదివారం నాడు బ్యాంకుకు సెలవు కావడంతో సోమవారం నాడు నోట్లను మార్చుకోవాలని బ్యాంకు సెక్యూరిటీ గార్డు చెప్పారు. దీంతో ఖాతాదారులు ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు.మరికొందరికి కూడ ఇదే రకంగా నకిలీ నోట్లు రావడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ ఎటిఎం సెంటర్ను పోలీసులు మూసివేయించారు.ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని సౌత్ కాన్పూర్ ఎస్పీ తెలిపారు. అసలు నోట్లకు బదులుగా నకిలీ నోట్లు ఎటిఎం మెషిన్లకు ఎలా వచ్చాయనే విషయమై పోలీసులు విచారణ చేయనున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications