who is Jharkhand next cm: హేమంత్ సోరెన్కే ప్రజల పట్టం, 29 శాతం ఓట్లు అని సర్వే...
జార్ఖండ్ ఎగ్జిట్ పోల్ అంచనాలను సంస్థలు లెక్కగట్టాయి. కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టబోతుందని అన్నీ సంస్థలు ఢంకా బజాయించి చెప్పాయి. ఇక సంకీర్ణ ప్రభుత్వంలో సీఎం ఎవరనే అంశంపై చర్చకు దారితీసింది. అభ్యర్థులపై యాక్సిస్ మై ఇండియా సర్వే చేపట్టింది. 29 శాతం మంది ప్రజలు హేమంత్ సోరెన్ తదుపరి సీఎం అని పేర్కొనడం విశేషం.

సోమవారం ఓట్ల లెక్కింపు..
జార్ఖండ్ ఐదో విడత పోలింగ్ శుక్రవారం సాయంత్రం ముగిసింది. 16 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్లో 71 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఈ నెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. అయితే బీజేపీ అధికారం కోల్పోబోతుందని ఎగ్జిట్ పోల్ అంచనాలను కమలదళం జీర్ణించుకోలేకపోతుంది. ఈ క్రమంలో యాక్సిస్ మై ఇండియా ఎవరు తదుపరి సీఎం అనే అంశంపై సర్వే చేపట్టింది. ఇందులో జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్కు ప్రజలు పట్టం కట్టారు.

ఫస్ట్ ప్లేస్..
29 శాతం ఓట్లతో హేమంత్ సోరెన్ తొలి స్థానంలో నిలిచారు. తర్వాత ప్రస్తుత సీఎం రఘుబర్ దాస్ ఉన్నారు. బాబులాల్ మరాండీ 10 శాతం ఓట్లతో మూడోస్థానాన్ని సరిపెట్టుకున్నారు. ఏజేఎస్యూ అధినేత సుదేశ్ మహతో 9 శాతం, అర్జున్ ముండా 6 శాతం, శిబు సోరెన్కు కూడా 6 శాతం ప్రజలు ఓట్లు వేశారు. స్టీపెన్ మరాండి కేవలం ఒక్క శాతం, జయంత్ సిన్హా ఒక్క స్థానం, మధు కోడా ఒక్క స్థానం, సర్యు రాయ్ 1 శాతం ప్రజలు ఓటేశారు. ఇతరులు, నాకు తెలియదని 10 శాతం మంది ప్రజలు ఓటేయడం విశేషం.

మూడో స్థానంలో..
మాజీ సీఎం బాబులాల్ మారాండికి కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే రావడం చర్చకు దారితీసింది. మూడోస్థానంలో నిలవడంతో ఆయనకు ప్రజల మద్దతు లేదనే అంశం తేలిపోయింది. మిగిలిన నేతలు, మహమహులను కూడా ప్రజలు తిరస్కరించారు. తమ తదుపరి సీఎంగా ఎంపిక చేసేందుకు ముందుకురాకపోవడం విశేషం.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications