అయోధ్య వివాదంలో ఇతరుల జోక్యానికి సుప్రీం నో
న్యూఢిల్లీ: అయోధ్య వివాదంలో అసలు పార్టీలు ఎవరైతే ఉన్నారో వారినే తమ వాదనలు విన్పించేందుకు అనుమతించనున్నట్టు సుప్రీం కోర్టు బుధవారం నాడు ప్రకటించింది.
బాబ్రీమసీదు భూ వివాదం కేసులో ఇతరులు జోక్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.అయోధ్య వివాదానికి సంబంధించిన కేసును విచారిస్తున్న ప్రత్యేక సుప్రీం కోర్టు బెంచ్ బుధవారం నాడు ఈ మేరకు అభిప్రాయపడింది.

చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, ఆశోక్ భూషణ్, ఎస్ఎ నజీబ్ లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ భూవివాదంతో సంబంధం లేని ఇతరుల జోక్యానికి సంబంధించి అసలు పిటిషన్ దారుల వాదనలు వినేందుకు సిద్దమని ప్రకటించింది.
బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి ఈ వివాదంలో జోక్యం కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
వివాదాస్పద స్థలంలో పూజలకు అనుమతివ్వాలని సుబ్రమణ్యస్వామి పిటిషన్ ధాఖలు చేశారు. ఈ పిటిషన్ ను తిరస్కరించింది. అలహబాద్ హైకోర్టు కు ముగ్గురు సభ్యులతో కూడిన జడ్జిల బృందం 2010లో ఒక తీర్పును వెలువరించింది.












Click it and Unblock the Notifications