నేనైతే రూ.35-రూ.45కు ఇస్తా: పెట్రోల్ ధరలపై మోడీకి రాందేవ్ బాబా వార్నింగ్
Recommended Video

న్యూఢిల్లీ: పెట్రోల్ ధరల పెరుగుదలపై వినియోగదారులు అసంతృప్తితో ఉన్నారు. విపక్షాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. గత యూపీఏ హయాంలో చేసిన బాకీలు తీర్చడం, రూపాయి విలువ తగ్గడం వంటి కారణాలు పెట్రో ధరల పెరుగుదలకు కారణాలుగా చెబుతున్నారు. అయినప్పటికీ విమర్శలు ఆగడం లేదు. తాజాగా బాబా రాందేవ్ ఈ ధరలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆయన ఓ ఇంగ్లీష్ చానల్తో మాట్లాడుతూ.. ఈ అంశంపై స్పందించారు. ఈ ధరల పెరుగుదల కారణంగా వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరికలు జారీ చేశారు. తాను గనుక ప్రభుత్వంలో ఉండి ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలపై వినియోగదారులకు ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చేవాడినని, పెట్రోల్, డీజిల్లను రూ.35 నుంచి రూ.45 మధ్య ఇచ్చేవాడినని చెప్పారు.

పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చాలామంది ప్రజలు మోడీని విమర్శిస్తున్నారని, కానీ స్వచ్ఛ భారత్ వంటి మంచి కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభించారని గుర్తు చేశారు. వాక్స్వాతంత్య్రం ప్రజల ప్రాథమిక హక్కు అని గుర్తు చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తారా అని అడిగితే, తాను ఎందుకు ప్రచారం చేయాలని ఎదురు ప్రశ్నించారు. తనంతట తానే రాజకీయాలకు దూరంగా వచ్చానని చెప్పారు. తాను ఏపార్టీతోనూ లేనని, అన్ని పార్టీలతోనూ ఉంటానని తెలిపారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications