ఈ సారి మరింత భయంకరంగా కరోనా..? బాబా వంగా సంచలన జోస్యం..?
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్-19 కేసులు పెరిగిపోతున్నాయి. వారం క్రితం వరకూ దేశంలో అదుపులోనే ఉన్న మహమ్మారి.. గత రెండు రోజులుగా కేసులు పెరుగుదల కనిపించడం ఆందోళనకరంగా మారింది. మే 26 నాటికి దేశంలో కొవిడ్ కేసులు వేయి మార్కును దాటేశాయి. కేరళ, మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో తాజాగా 430 మందికి పైగా కొవిడ్ సోకింది. ఆ తరువాత తమిళనాడులో 69, కర్ణాటకలో 47, గుజరాత్లో 83, రాజస్థాన్లో 13,బెంగాల్లో 12.. కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇక ప్రస్తుతం దేశంలో ఎన్బీ.1.8.1, ఎల్ఎఫ్.7 అనే రెండు కొత్త కొవిడ్ సబ్ వేరియంట్లను వైద్యులు గుర్తించారు. చైనాతో పాటు ఆసియాలోని పలు దేశాల్లో కరోనా కేసులు పెరగడానికి ఈ సబ్ వేరియంట్లు కారణం అని ఐసీఎంఆర్ ఇటీవల పేర్కొంది. ఈ సబ్ వేరియంట్ల వల్ల దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి విశ్లేషణ చేస్తున్నామని పేర్కొంది.
భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి బాబా వంగా జోస్యంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. 2030లో ఓ కొత్త వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతుందని బాబా వంగా అంచనా వేశారు. కానీ ఈ కొవిడ్ వైరస్ అంతకు ముందే వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కరంగా ఉంది.

అయితే బాబా వంగా గతంలోనూ చెప్పిన అనేక అంచనాలు నిజం అయ్యాయి. ఆమె గతంలో సునామీ అని హెచ్చరించారు. 2025 జూలై నెలలో జపాన్, ఫిలిప్పీన్స్ లను పెను సునామీ తాకుతుందని అంచనా వేశారు. 2011లో ఏర్పడిన విపత్తు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని బాబా వంగా అంచనా వేశారు. అంతేకాక జపాన్, తైవాన్, ఇండోనేషియా, ఉత్తర మరియానా దీవులు.. భూకంపం, సునామీ ప్రభావంతో అల్లకల్లోలం అవుతాయని అంచనా వేశారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications