బెంగాల్లో పరిస్థితి ఉద్రిక్తం.. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కారు ధ్వంసం..
అసన్సోల్ : నాల్గో విడత పోలింగ్లోనూ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు తెలెత్తాయి. పలు పోలింగ్ కేంద్రాల వద్ద తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తాయి. అసన్సోల్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద తృణమూల్ కార్యకర్తలు కేంద్రబలగాలు లేకుండా పోలింగ్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అక్కడి భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిని అదుపుచేసేందుకు ప్రయత్నించడంతో ఆందోళనకారులు భద్రతా దళాలపై దాడికి దిగారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
West Bengal: BJP MP candidate from Asansol, Babul Supriyo's car vandalised in Asansol. A TMC polling agent says, there is no BJP polling agent here. pic.twitter.com/kBNmpXCvPD
— ANI (@ANI) April 29, 2019
ఇదిలా ఉంటే అసన్సోల్ పోలింగ్ బూత్ వద్ద పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోపై టీఎంసీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. పోలింగ్ బూత్ వద్దకు వెళ్లకుండా ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు కారు అద్దాలు పగలగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బాబు సుప్రియోను అక్కడి నుంచి తరలించారు.