బళ్లారి గాలి బ్రదర్శ్ గూండాలతో బెదిరించారు. శ్రీరాములుకు ఏం తెలుసు: మాజీ సీఎం!
బెంగళూరు: లోక్ సభ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. ఉప ఎన్నికల్లో విజయం సాంధించడానికి బీజేపీ నాయకులు ఎంతకైనా తెగిస్తారని మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.
కొన్ని సంవత్సరాలుగా బళ్లారి ప్రజలు భయం, ఆందోళనలతో సతమతం అవుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు ప్రశాంతంగా ఉంటరని సిద్దరామయ్య అన్నారు. లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారం సందర్బంగా. తాను గతంలో బళ్లారికి వచ్చిన సమయంలో ఎదురైన సంఘటనలు సిద్దరామయ్య గుర్తు చేసుకున్నారు.

రెడ్డి బ్రదర్స్ గూండాలు
కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నానని సిద్దరామయ్య గుర్తు చేశారు. ఆ సందర్బంలో తాను బెంగళూరు నుంచి బళ్లారికి పాదయాత్రగా వచ్చానని, ఆ సమయంలో గాలి జనార్దన్ రెడ్డి సోదరులు గూండాలతో తమను బెదిరించారని సిద్దరామయ్య ఆరోపించారు.

పోలీసులు పరుగు
సండూలో తాను బహిరంగ సమావేశం నిర్వహించడానికి గాలి జనార్దన్ రెడ్డి సోదరులు అవకాశం ఇవ్వలేదని, కనీసం స్థలం కూడా ఇవ్వకుండా గూండాలతో బెదిరించారని, వారి దెబ్బకు పోలీసులు సైతం పరుగు తీసి చేతులు ఎత్తి వేశారని సిద్దరామయ్య ఆరోపించారు. సండూరు ప్రజలు ఇప్పటికీ భయంతో ఆందోళన చెందుతున్నారని, కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తే ప్రజల సమస్యలు అన్నీ తీరిపోతాయని సిద్దరామయ్య అన్నారు.

శ్రీరాములుకు ఏం తెలుసు ?
బళ్లారి శ్రీరాములుకు 371 జే అంటే ఏం అర్థం తెలుసు అని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రశ్నించారు. అయితే నేరాలు ఎలా చెయ్యాలి, వాటి సెక్షలు ఏమిటీ ? వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయంపై శ్రీరాములుకు పూర్తి అవగాహన ఉందని సిద్దరామయ్య ఆరోపించారు. ఇదే విషయంలో సిద్దరామయ్య సోషల్ మీడియాలో సైతం శ్రీరాములుపై విమర్శలు చేశారు.

జాతి రాజకీయాలు ?
శ్రీరాములును విమర్శిస్తే నాయక్ కులాన్ని విమర్శించినట్లే అని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారని, అయితే అదే శ్రీరాములు, బీజేపీ నాయకులు తనను విమర్శిస్తే కురబ జాతిని విమర్శించినట్లేనా ? అని సిద్దరామయ్య ప్రశ్నించారు. ఒక వ్యక్తిని విమర్శిస్తే వారి జాతిని విమర్శించినట్లు ఎలా అవుతుంది అని సిద్దరామయ్య బీజేపీ నాయకులను ప్రశ్నించారు.

బళ్లారి సీటు మీద గురి
బళ్లారి లోక్ సభ ఉన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వీఎస్. ఉగ్రప్ప, బీజేపీ నుంచి బళ్లారి శ్రీరాములు సొంత సోదరి శాంతా ఉప ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే పోటీ మాత్రం వీరిద్దరి మద్య లేదు. కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్, బళ్లారి శ్రీరాములు మధ్య నువ్వానేనా అంటూ పోటీ ఏర్పడంతో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications