బెంగాల్లో బీజేపీ కార్యకర్త హత్య.. రాజకీయ హత్య అంటోన్న అమిత్ షా..సీబీఐ విచారణకు డిమాండ్
పశ్చిమ బెంగాల్లో టీఎంసీ వర్సెస్ బీజేపీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. బీజేపీ శ్రేణులకు వేధింపులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు కొందరీపై దాడులు కూడా జరుగుతున్నాయి. ఇటీవల కోల్ కతాలో ఓ బీజేపీ కార్యకర్త హత్యకు గురయ్యారు. చిట్పూర్ కొసిపోర ఏరియాలో ఘటన జరిగింది. దీనిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఖండించారు. హత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అర్జున్ చౌరసియా అనే బీజేపీ కార్యకర్త పాడుబడ్డ భవనంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసి వేలాడదీయబడ్డాడు. అమిత్ షాకు స్వాగతం పలికే శ్రేణుల్లో ఒకరు.. ఇతని నేతృత్వంలో బైక్ ర్యాలీ తీయాల్సి ఉంది. కానీ ఇంతలోనే దారుణ హత్యకు గురయ్యారు. దీనిని అమిత్ షా ఖండించారు. బెంగాల్లో ఏం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.

బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం ఏర్పడి నిన్నటితో ఏడాది పూర్తయ్యింది. ఆ వెంటనే ప్రత్యర్థులపై హత్యలు చేస్తోంది. అర్జున్ హత్యను బీజేపీ ఖండించింది. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుడి నానమ్మను కూడా కొట్టారని అమిత్ షా పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అమిత్ షా ఆదేశించారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని అమిత్ షా అన్నారు.
హింస రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం కాదని అమిత్ షా అన్నారు. బెంగాల్లో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు. బెంగాల్ హైకోర్టు అనుమతితో కేసులను సీబీఐకి అప్పగించాలని అభిప్రాయపడ్డారు. సీబీఐ విచారణతో నిజాలు నిగ్గు తేలుతాయని ఆయన అంటున్నారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినతి వస్తే.. సీబీఐ విచారణ జరిపిస్తామని షా అంటున్నారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications