బెంగాల్ వార్ ... రేపు మృతుల ఇళ్ళకు సీఎం మమతా బెనర్జీ , అక్కడ పోలింగ్ నిలిపివేసి నివేదిక కోరిన ఈసీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు నాల్గవ దశ ఓటింగ్ మధ్య శనివారం కూచ్ బెహార్లో సిఐఎస్ఎఫ్ జవాన్లు నలుగురు వ్యక్తులను కాల్చి చంపినఘటన ఇప్పుడు రాజకీయ దుమారంగా మారింది . నలుగురు మృతితో ఉద్రిక్తతల నడుమ, ఎన్నిక కమిషన్ సితాల్కుర్చి అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ 126 లో పోల్ను వాయిదా వేయాలని ఆదేశించింది. స్పెషల్ అబ్జర్వర్ల మధ్యంతర నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.
శనివారం సాయంత్రం 5 గంటలకు వారి నుండి, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నుండి వివరణాత్మక నివేదికలు కోరింది.

తమపై కుట్ర జరుగుతోందన్న మమతా బెనర్జీ
హింగల్గంజ్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, "సిఆర్పిఎఫ్ ఈ రోజు సితాల్కుర్చి (కూచ్ బెహార్) లో నలుగురిని కాల్చి చంపింది. ఉదయం మరో మరణం జరిగింది. సిఆర్పిఎఫ్ నా శత్రువు కాదు కాని మా చుట్టూ హోంమంత్రి సూచనల మేరకు కుట్ర జరుగుతోందని నేటి సంఘటన ధృవీకరిస్తుంది అని ఆమె పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓడిపోయారని బిజెపి నేతలకు తెలుసు, కాబట్టి వారు ఓటర్లను, కార్మికులను చంపేస్తున్నారు "అని బెనర్జీ అన్నారు.

మృతుల కుటుంబాలను పరామర్శించనున్న మమతా బెనర్జీ
మరణించిన వారు టీఎంసీ కార్యకర్తలు అని టీఎంసీ నేతలు చెప్తున్నారు. దీంతో మరణించిన టిఎంసి కార్మికుల ఇంటిని బెనర్జీ ఆదివారం సందర్శించనున్నట్లు వర్గాలు తెలిపాయి.
మృతుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. కాల్పులకు పాల్పడిన సిఐఎస్ఎఫ్ సిబ్బందిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అని అడిగినప్పుడు, ఒక సీనియర్ పోలీసు అధికారి ఈ ఘటనపై ఈసి నిర్ణయించాల్సిన అవసరం ఉంది. మా నివేదికల ప్రకారం వారు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు అని అన్నారు.

సిటాల్కుచి అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 126 వద్ద పోలింగ్ వాయిదా
కూచ్ బెహార్ లోని సిటాల్కుచి అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 126 వద్ద పోలింగ్ ఆగిపోయింది, తదుపరి దర్యాప్తు జరుగుతోంది,
ఈ సంఘటనపై జిల్లా అధికారుల నుండి నివేదిక కోరినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నాలుగు మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ హత్యలకు హోం మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని మమతా బెనర్జీ మండిపడుతున్నారు . మమతా బెనర్జీ పార్టీ గూండాల వల్లే ఈ మరణాలు సంభవించాయని బీజేపీ ఎదురు దాడికి దిగింది.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications