కొడుకు గూండాగిరి, కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రి బహిరంగ క్షమాపణ, అహంకారం, సీసీటీవీ!
బెంగళూరు: బెంగళూరు నగరంలోని శాంతినగర నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్.ఏ. హ్యారీస్ తన కొడుకు మోహమ్మద్ హ్యారీస్ నలపాడ్ పబ్ లో యువకుడు విద్వత్ (24) మీద చేసిన దాడికి తాను బహిరంగ క్షమాపణ చెబుతున్నానని బహిరంగ లేఖ రాశారు. తన కుమారుడు మోహమ్మద్ విద్వత్ మీద దాడి చెయ్యడం దురదృష్టకరం అని ఎమ్మెల్యే హ్యారీస్ బహిరంగ క్షమాపణ లేఖ రాశారు. డబ్బు, పలుకుబడి ఉందనే అహంకారంతో దాడి చేశాడని, సీసీకెమెరాలు పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

ఎవ్వరైనా ఒక్కటే
తాను 9 సంవత్సరాల నుంచి శాంతినగర నియోజక వర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేస్తున్నానని హ్యారీస్ అన్నారు. తన నియోజక వర్గం ప్రజలకు, తన కుమారుడికి ఒకే న్యాయం, ఒకే చట్టం, తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించాలని ఎమ్మెల్యే హ్యారీస్ వివరించారు.

మీడియా రాద్దాంతం
శనివారం రాత్రి యూబీ సిటీలోని పబ్ లో విద్వత్ మీద తన కుమారుడు మోహమ్మద్ దాడి చెయ్యడం దురదృష్టకరం, కబ్బన్ పార్క్ పోలీసుల ముందు లొంగిపోవాలని తన కుమారుడికి సూచించాను, మరో సారి విద్వత్, ఆయన కుటుంబ సభ్యులకు తాను బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని, ఈ విషయంలో మీడియా రాద్దాంతం చేస్తుందోని ఎమ్మెల్యే హ్యారీస్ అన్నారు.

100 శాతం సహకరిస్తాం
చట్టం ఎవరికైనా ఒక్కటే, తన కుమారుడు మోహమ్మద్ చేసిన దాడికి పోలీసుల విచారణకు తనతోపాటు తన కుటుంబ సభ్యులు వంద శాతం సహకరిస్తామని ఎమ్మెల్యే హ్యారీస్ చెప్పారు. ఇలాంటి కష్ట సమయంలో తనకు అండగా ఉన్న నియోజక వర్గ ప్రజలకు, సన్నిహితులకు ఎమ్మెల్యే హ్యారీస్ ధన్యవాదాలు చెప్పారు.

పబ్ లో విచారణ
ఎమ్మెల్యే హ్యారీస్ కుమారుడు మోహమ్మద్, అతని స్నేహితులను సోమవారం కబ్బన్ పార్క్ పోలీసులు యూబీ సిటీలోని పబ్ దగ్గరకు పిలుచుకుని వెళ్లి ఆ రోజు రాత్రి ఏం జరిగింది, గొడవ ఎలా మొదలైయ్యింది అని విచారణ చేస్తున్నారు.

సీసీ కెమెరాలు
యూబీ సిటీలోని పబ్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. చిన్న విషయంలో గొడవ జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. విద్వత్ మీద దాడి చేశామని ఎమ్మెల్యే కుమారుడు మోహమ్మద్, అతని స్నేహితులు మంజునాథ్ అశ్రఫ్, నాసీర్, అభిషేక్, బాలక్రిష్ణ, అరుణ్ బాబు అంగీకరించారని పోలీసులు అంటున్నారు.

డబ్బు, అహంకారం
డబ్బు, పలుకుబడి ఉంది కదా అనే అహంకారంతో ఎమ్మెల్యే హ్యారీస్ కుమారుడు మోహమ్మద్ అమాయకుడిపై దాడి చేశాడని, అతని మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, రాజకీయ పార్టీ ముసుగులో గూండాలుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.
-
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications