పోలీసులే దొంగలు: రూ. లక్షలు దోపిడీకి యత్నం, అరెస్టు
రూ. 66 లక్షల విలువైన పాత, కొత్త నోట్లు లూటీ చెయ్యడానికి ప్రయత్నించిన 8 మంది పోలీసుల మీద బెంగళూరులో కేసులు నమోదు అయ్యాయి. కేసులు నమోదు అయిన వెంటనే పోలీసులను సస్పెండ్ చేశారు.
బెంగళూరు: పాత నోట్లు రద్దు తరువాత చేతివాటం చూపించడానికి ప్రయత్నించిన 8 మంది పోలీసులకు విధుల నుంచి తప్పిస్తూ బెంగళూరు పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి విచారణ చేపట్టకుండానే పోలీసు అధికారులు సంచలన నిర్ణయం తీసుకుని షాక్ ఇచ్చారు.
రద్దు అయిన పాత నోట్లు రూ. 1,000, రూ. 500 నోట్లను కొత్త రూ. 2,000, రూ. 500 నోట్లుగా మార్చి ఇస్తామని నమ్మించి మోసం చేసి దోపిడీలు చెయ్యడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ 8 మంది పోలీసుల మీద బెంగళూరులోని కలాసిపాళ్య, గిరినగర, మాగడి రోడ్డు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి.

ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 35.50 లక్షలు, మరో పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 8 లక్షలు, మరో పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 22.30 లక్షలు దోపిడీ చెయ్యడానికి ప్రయత్నించడంతో వీరి మీద సెక్షన్ 311 (బి) ప్రకారం కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు.
ఈ మూడు దోపిడీల కేసుల్లో సబ్ ఇన్స్ పెక్టర్ ఎన్.సి. మల్లికార్జున, హెడ్ కానిస్టేబుల్ మయూర, మంజునాథ్, గిరీష్, చంద్రశేఖర్, అనంతరాజు, రాఘవ కుమార్, శేషు అనే పోలీసుల మీద కేసులు నమోదు చేసి సస్పెండ్ చేశారు. అందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications