మాల్ పై ఐటీ దాడులు: రూ. 169 కోట్ల అక్రమ ఆస్తి
బెంగళూరు: బెంగళూరు నగరంలోని రెండు ప్రముఖ మాల్స్ యాజమానులు, స్థిరాస్థి వ్యాపారులపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. డిసెంబర్ 23 నుంచి 26వ తేది రాత్రి వరకు జరిగిన ఐటీ సోదాలలో రూ. 169 కోట్ల విలువైన అప్రకటిత ఆదాయం గుర్తించారు.
ఓ ప్రముఖ మాల్ నిర్వహకులు కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు రూ. 143 కోట్ల విలువైన అప్రకటిత ఆదాయాన్ని గుర్తించారు. ఆ మాల్ యాజమాన్యం మొదట ప్రభుత్వానికి లెక్కల్లో చూపించిన దాని కంటే రూ. 143 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు గుర్తించామని అధికారులు తెలిపారు.

రెండవ కేసులో అక్రమ ఆదాయంగా చూపిస్తున్న రూ. 26 కోట్లు గుర్తించామని ఐటీ అధికారులు తెలిపారు. వీరి ఆదాయ పన్నుశాఖకు తెలిపిన వివరాల ప్రకారం రూ. 500 కోట్ల వ్యాపారం చేస్తున్నారని, సోదాల్లో అదనంగా రూ. 169 కోట్ల అక్రమ ఆదాయం చూపిస్తున్నారని అధికారులు తెలిపారు.
అక్రమ ఆదాయంతో వీరు బంగారు నగలు, బంగారు బిస్కెట్లు కొనుగోలు చేశారని, తమ సొంత ఖర్చులను వాణిజ్య వ్యయాలుగా చూపించారని, దర్యాప్తు జరుగుతుందని ఐటీ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. సోదాలలో రూ. కోట్ల విలువైన రూ. 2,000 కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications