షాక్: విధాన సౌధలోకి ఆ ‘కాయ’నిషేధం, నాయకుల చేతుల్లో ట్రింగ్ ట్రింగ్, పోలీసుల నవ్వులు !
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ, ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిపాల విభాగాల కేంద్రం విధాన సౌధ గురించి మరోసారి జోరుగా చర్చ జరుగుతోంది. అయితే రాజకీయాల గురించి కాదు, రాజకీయ నాయకులు పరస్పర ఆరోపణలు అంతకంటే కాదు, ప్రతిరోజూ తమ సమస్యలను పరిష్కరించాలని విధాన సౌధలోకి వెలుతున్న ప్రజల గురించి. ఎవరైనా సరే, విధాన సౌధలోకి నిమ్మ కాయలు లేదా నిమ్మపండ్లు తీసుకురాకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చెయ్యడం నవ్వు తెప్పిస్తోంది.
ఆశ్చర్యానికి గురి చేస్తున్న ప్రభుత్వ ఆదేశాలు గురించి తెలుసుకున్న ఉద్యోగులు, ప్రజలు షాక్ కు గురైనారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖల కార్యాలయాలు విధాన సౌధలో ఉన్నాయి. కర్ణాటక అసెంబ్లీ అక్కడే ఉంది. తమ సమస్యలు పరిష్కరించాలని మనవి చేస్తూ ప్రతిరోజూ ప్రజలు విధాన సౌధ ముందు క్యూ కడుతుంటారు.

నిమ్మకాయలు సీజ్
విధాన సౌధలోని అన్ని గేట్ల (ప్రవేశ ద్వారాలు) దగ్గర లోపలికి వెలుతున్న అధికారులు, ఉద్యోగులు, ప్రజలను పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వారి బ్యాగులు, జోబుల్లో నిమ్మకాయలు, నిమ్మపండ్లు ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు.

మేము మాత్రం ఏం చేస్తాం !
సార్, ఏమిటిది అని ప్రజలు ప్రశ్నిస్తే మేము మాత్రం ఏం చేస్తాం, ప్రభుత్వ ఆదేశాలు అలా ఉన్నాయంటూ పోలీసులు సమాధానం ఇవ్వడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురౌతున్నారు. విధాన సౌధలోకి నిమ్మకాయలు, నిమ్మపండ్లు నిషేధించిన తరువాత ప్రతిరోజూ పోలీసులు దాదాపు 30 నుంచి 40 వరకు నిమ్మకాయలు లేదా నిమ్మపండ్లు స్వాధీనం చేసుకుంటున్నారు.

ఆత్మహత్యా యత్నం చేస్తారని !
ఒక్కోరోజు స్వాధీనం చేసుకునే నిమ్మకాయల సంఖ్య 50 దాటిపోతుందని అక్కడ పని చేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది అంటున్నారు. విధాన సౌధలోనికి వచ్చే కొందరు ఎక్కడ సహనం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుకోవడానికి ప్రయత్నిస్తారో అనే ఆందోళనతో ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ఔషదాలు, మాత్రలు, బ్లేడ్లు, కత్తులు, కిరొసిన్, పెట్రోల్ లాంటివి వస్తులు నిషేధించింది.

సెక్యూరిటీ సిబ్బంది
ఇప్పుడు ఆ జాబితాలోకి నిమ్మకాయలు, నిమ్మ పండ్లు చేరడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురౌతున్నారు. ఎవరైనా నిమ్మకాయలు, నిమ్మ పండ్లు తీసుకుని విధాన సౌధ దగ్గరకు వెలితే ప్రవేశ ద్వారం దగ్గర అక్కడ ఉన్న పోలీసులు, సెక్యూరిటీ సిబ్బందికి వాటిని అప్పగించి లోపకి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పోలీసుల నవ్వులు
విధాన సౌధలోకి నిమ్మకాయలు లేదా నిమ్మపండ్లు తీసుకెళ్లడం ఎందుకు నిషేధించారు అంటే అక్కడ ఉన్న పోలీసులు, సెక్యూటి సిబ్బంది నవ్వే సామాధానం అయ్యింది. కర్ణాటకలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు నిత్యం నిమ్మకాయలు చేతిలో పట్టుకుని విధాన సౌధలో ట్రింగ్ ట్రింగ్ అంటూ దర్శనం ఇస్తుంటారు.

చేతబడి చేశారనే భయం ?
కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో విధాన సౌధ ముందు చేతబడి చేశారని ప్రచారం జరిగింది. తరువాత విధాన సౌధలోకి నిమ్మకాయలు, నిమ్మ పండ్లు తీసుకెళ్లడం నిషేధించారు. తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు నిమ్మకాయల నిషేధాన్ని ఎత్తివేశాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ నిమ్మకాయలు, నిమ్మపండ్లు విధాన సౌధలోకి తీసుకెళ్లడం నిషేధించడంతో మరోసారి చర్చకు దారితీసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications