ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆయన భార్య ఫోటోలే
బెంగళూరు: ఓ ఫోటోగ్రాఫర్ సరదాగా తీసిన ఫోటోలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ప్రసిద్ది చెందిన యాపిల్ సంస్థ (ఐ ఫోన్) తన కంపెనీ ప్రచారానికి ఆ ఫోటో గ్రాఫర్ తీసిన ఫోటోలు ఉపయోగిస్తున్నది. ఇంతకి ఆయన తీసిన ఫోటోలు ఎవరి వంటే ఆయన గారి భార్యవే.
బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న ఆశిష్ పర్మార్ ఫోటో గ్రాఫర్ గా పని చేస్తున్నాడు. ఈయన భార్య రైనా నన్నయ్య. గత దీపావళి పండుగ సందర్బంగా ఆశిష్ ఆర్మార్ తన భార్య ఫోటోలను ఆయన ఐఫోన్ 6 ఎస్ లో తీశాడు. దీపాన్ని పట్టుకుని ఆ దీపం వెలుగులు ఆమె ముఖం మీద పడుతున్నట్లు చక్కగా ఫోటోలు తీశారు.
యాపిల్ సంస్థ నిర్వహించిన షాట్ ఆన్ ఐ ఫోన్ 6 ఎస్ ప్రచార కార్యక్రమానికి ప్రపంచంలోలోని ఉత్తమ ఫోటోలు తీసిన (ఐ ఫోన్ 6ఎస్ తో) ఫోటోలను ఎంపిక చేశారు. అందులో 53 ఉత్తమ ఫోటోలు ఎంపిక అయ్యాయి. అందులో ఆశిష్ ఆర్మర్ తన భార్యను తీసిన ఫోటోలు ఎంపిక అయ్యాయి.
చివరికి యాపిల్ సంస్థ ఆశిష్ తీసిన ఫోటోలను ఎంపిక చేసుకుని తన సంస్థ ప్రచార కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారు. తాను సరదాగా తీసిన ఫోటోలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో ఆశిష్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
అంతే కాకుండా తాను తీసిన తన భార్య రైనా నన్నయ్య ఫోటోలు ప్రపంచ వ్యాప్తంగా హోర్డింగ్ ల్లో పడటంతో భర్తగానూ ఆయన హ్యాపీగా ఉన్నారు. ఓ ఫోటో గ్రాఫర్ గా, భర్తగా తాను చాల సంతోషంగా ఉన్నానని ఆశిష్ అంటున్నారు. మీడియా సభ్యలు ఇంటర్వూలు అంటూ వెంటపడుతున్నారని సంబరపడిపోతున్నారు.