ప్రముఖ మోడల్ దారుణ హత్య, బెంగళూరులో క్యాబ్ డ్రైవర్ అరెస్టు, లేడీ ఉంగరం!
బెంగళూరు: బెంగళూరులో దారుణ హత్యకు గురైన పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రముఖ మోడల్ హత్య కేసులో ఓలా క్యాబ్ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కోల్ కతాలోని న్యూటౌన్ నివాసి పూజా సింగ్ హత్య కేసులో ఓలా క్యాబ్ డ్రైవర్ ను బెంగళూరులోని బాగలూరు పోలీసులు అరెస్టు చేశారు. పూజా సింగ్ ఉంగరం ఓలా క్యాబ్ డ్రైవర్ ను పట్టించింది.
బెంగళూరు నడర శివార్లలో పూజా సింగ్ హత్యకు గురైయ్యింది. ఇదే కేసులో ఓలా క్యాబ్ డ్రైవర్ ఎం. నాగేష్ (22) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాడయరపనహళ్ళిలో పూజా సింగ్ మృతదేహాన్ని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.
జులై 31వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో బెంగళూరులోని క్రెసెంట్ రోడ్డులో ప్రముఖ మోడల్ పూజా సింగ్ నాగేష్ క్యాబ్ లో ఎక్కింది. క్రెసెంట్ రోడ్డు నుంచి పరప్పన అగ్రహార చేరుకున్న పూజా సింగ్ అక్కడే కారు దిగింది. మరుసటి రోజు వేకువ జామున 4 గంటలకు తాను ఎయిర్ పోర్టుకు వెళ్లాలని, నీవే ఇక్కడకు వచ్చి తనను పిక్ చేసుకోవాలని పూజా సింగ్ ఓలా క్యాబ్ డ్రైవర్ నాగేష్ కు చెప్పింది.

మరుసటి రోజు వేకువ జామున నాలుగు గంటలకు పూజా సింగ్ ఉంటున్న చోటకు వెళ్లిన ఓలా క్యాబ్ డ్రైవర్ నాగేష్ ఆమెను కారులో పిలుచుకుని ఎయిర్ పోర్టు దగ్గరకు బయలుదేరాడు. మార్గం మధ్యలో తనకు డబ్బులు, నగలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తానని ఓలా క్యాబ్ డ్రైవర్ నాగేష్ మోడల్ పూజా సింగ్ ను బెదిరించాడు.
నగదు, నగలు ఇవ్వడానికి నిరాకరించిన పూజా సింగ్ మీద ఓలా క్యాబ్ డ్రైవర్ నాగేష్ జాక్ రాడ్ తో దాడి చేశాడు. పూజా సింగ్ శరీరం మీద కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. తరువాత కాడయరపనహళ్ళి ప్రాంతానికి పూజా సింగ్ మృతదేహాన్ని తీసుకెళ్లి ముఖం మీద బండరాళ్లు వేసి గుర్తు పట్టని విదంగా చేశాడు.
పూజా సింగ్ మృతదేహాన్ని కాడయరపనహళ్ళిలో విసిరేసిన ఓలా క్యాబ్ డ్రైవర్ నాగేష్ అక్కడి నుంచి పరారైనాడు. గుర్తు తెలియని మహిళ మృతదేహం అని పోలీసులు కేసు నమోదు చేశారు. తరువాత పూజా సింగ్ కనపడటం లేదని ఆమె భర్త కోల్ కతాలో నగరంలోని న్యూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనుమానస్పదంగా తిరుగుతున్న నాగేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. నాగేష్ చేతిలో ఉన్న ఉంగరం (పూజా సింగ్ ఉంగరం) పరిశీలించగా అలాంటి ఉంగరాలు పశ్చిమ బెంగాల్ మహిళలు పెట్టుకుంటారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కోల్ కతా పోలీసులను సంప్రదించగా పూజా సింగ్ మాయం అయిన కేసు విషయం తెలిసిందని, పూజా సింగ్ ను తానే హత్య చేశానని ఓలా క్యాబ్ డ్రైవర్ నాగేష్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications