భారత్ బంద్ పాక్షికం: చిన్నారి ప్రాణంతీసిన బంద్! పెట్రోల్-డీజిల్పై చంద్రబాబు కీలక నిర్ణయం
National
oi-Srinivas G
By Srinivas
|
న్యూఢిల్లీ: రుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, విపక్షాలు సోమవారం (10-9-2018) భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. రూపాయి విలువ పతనం, ప్రపంచ చమురు ధరల పెరుగుదల నడుమ ఆదివారమూ వీటి పెంపు కొనసాగింది. పెట్రోలుపై లీటరుకు 12 పైసలు, డీజిలుపై 10 పైసలు వరకూ పెంపు కనిపించింది. చమురు ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు ఈ రోజు భారత్ బంద్ను నిర్వహించాయి.
బంద్ పాక్షికంగా విజయవంతమైంది. కాంగ్రెస్ పార్టీతో పాటు డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీఎస్ సహా 21 ప్రధాన విపక్షాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు బంద్లో పాల్గొన్నాయి. ఏపీలో వైసీపీ మినహా మిగతా పార్టీలు బందులో పాల్గొన్నాయి. బంద్ రోజే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పైన వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది రేపటి నుంచి అమలులోకి రానుంది.
భారత్ బంద్ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రో ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాట్ తగ్గిస్తూ శాసన సభలో చంద్రబాబు ప్రకటన చేశారు. తగ్గిన ధరలు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి. పెట్రోల్, డీజీల్ ధరలపై రూ.2 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రభుత్వంపై రూ.1120 కోట్ల భారం పడుతుంది.
Sep 10, 2018 3:28 PM
కాంగ్రెస్ ఇచ్చిన బంద్ పిలుపును ఎవరూ పట్టించుకోవట్లేదని, వారి మహాకూటమి బెలూన్ త్వరలోనే పేలిపోతుందని బీజేపీ నేతలు అంటున్నారు.
Sep 10, 2018 3:13 PM
పెట్రో ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sep 10, 2018 2:33 PM
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరిగిన భారత్ బంద్లో తెలుగుదేశం పార్టీ కూడా పాలుపంచుకొంది.
Sep 10, 2018 1:45 PM
పెరిగిన పెట్రోల్ ధరలపై ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క మాట్లాడటం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు.
Sep 10, 2018 1:02 PM
కాగా, రెండేళ్ల చిన్నారి మృతికి ట్రాఫిక్ జామ్ కారణం కాదని, కుటుంబ సభ్యులు ఇంటి నుంచి ఆలస్యంగా బయలుదేరారని జెహనాబాద్ ఎస్డీవో చెప్పారు.
Sep 10, 2018 12:55 PM
ఇటీవల హర్యానాలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసన ర్యాలీ కారణంగా ఓ అంబులెన్స్ ముందుకు కదలలేక అప్పుడే పుట్టిన బేబీ చనిపోయారని, ఇప్పుడు బీహార్లో భారత్ బంద్ కారణంగా మరో రెండేళ్ల చిన్నారని చనిపోయారని మండిపడుతున్నారు.
Sep 10, 2018 12:53 PM
పెరిగిన పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా భారత్ బంద్కు పిలుపునిచ్చింది. పలుచోట్ల నిరసనకారుల నిరసనలు హద్దుమీరాయి. వాహనాలను కాల్చుతున్నారు. పెట్రోల్ బంకులపై దాడులు చేస్తున్నారు. దుకాణాలను బలవంతంగా మూయించారు.
Sep 10, 2018 12:49 PM
Everyone has a right to protest but what is happening today? Petrol pumps and buses being set ablaze, putting to risk lives. A child died after an ambulance was stuck in the protests in Bihar's Jehanabad. Who is responsible?: Ravi Shankar Prasad,Union Minister #BharatBandhpic.twitter.com/UfvTn2P84U
ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉందని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలపవచ్చునని, కానీ ఈ రోజు ఏం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ బంకులపై దాడులు చేస్తున్నారని, బస్సులకు నిప్పు పెడుతున్నారని, తద్వారా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బీహార్లోని జెహనాబాద్లో పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా పలువురు ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారని, ఈ నిరసనలో అంబులెన్స్ నిలిచిపోయిందని, దీంతో ఓ చిన్నారి మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు.
Sep 10, 2018 12:40 PM
మోడీ ప్రభుత్వాన్ని మార్చే సమయం దగ్గరలో ఉందని మన్మోహన్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలు రాజకీయ విభేదాలను పక్కనబెట్టాలని, ఏకతాటిపై నిలబడి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.
Sep 10, 2018 12:40 PM
ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దేశ ప్రయోజనాలకు అవసరం లేనివెన్నో చేసిందని, అన్ని పరిమితులు దాటిందని, ప్రజలు విసుగెత్తిపోయారని, రైతులు అసంతృప్తిలో ఉన్నారని, యువతకు ఉద్యోగాలు లేక ఆందోళన చెందుతున్నారని మన్మోహన్ సింగ్ అన్నారు.
ఢిల్లీలో జరిగిన భారత్ బంద్ నిరసన కార్యక్రమంలో మరోసారి విపక్షాలు ఒకే వేదిక పైకి వచ్చాయి.
Sep 10, 2018 12:05 PM
The BJP government is so proud of themselves that even today when the Opposition has called for a 'bandh' they have increased fuel price in some places. Government can even say that inflation will bring development: Former UP CM Akhilesh Yadav #BharatBandhpic.twitter.com/GRsfBwL7fb
భారత్ బంద్ రోజు కూడా పెట్రో ధరలు పెరిగాయని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. విపక్షాలు భారత్ బంద్ నిర్వహిస్తుంటే బీజేపీ గర్విస్తున్నట్లుగా ఉందని, అవసరమైతే ద్రవ్యోల్భణం కూడా అభివృద్ధికి సూచిక అని చెబుతారేమో అన్నారు.
Sep 10, 2018 12:02 PM
Frustrated opposition doesn't have any strategy and leadership,what else can be expected from them? I hope God gives them sense so they can differentiate between positive & negative otherwise in future they will even lose their position as Oppn: UP CM Yogi Adityanath #BharatBandhpic.twitter.com/SJUvp52h2u
ఒత్తిడిలో ఉన్న కాంగ్రెస్, ఇతర విపక్షాలకు ఓ వ్యూహం, లీడర్షిప్ లేదని, అలాంటి వారి నుంచి మనం ఏం ఆశించగలమని, దేవుడు వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నానని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
Sep 10, 2018 12:01 PM
'Bharat' will not be 'bandh', it will keep moving and progressing. No one is paying heed to this call by Congress, their 'Mahagatbandhan' balloon will also burst soon: Mukhtar Abbas Naqvi,Union Minister pic.twitter.com/tKwQpemUuN
భారత్.. బంద్ కాదని, భారత్ అభివృద్ధి ముందుకు సాగుతుందని, కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్ పిలుపును ఎవరూ పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు.
Sep 10, 2018 11:54 AM
Aaj poora vipaksh yahan ek saath baitha hai. Hum sab mil kar ek saath, BJP ko hatane ka kaam karenge: Rahul Gandhi during #BharathBandh protests in Delhi pic.twitter.com/CIbjNtcAs9
విపక్షాలన్నీ కలిసి బీజేపీని గద్దె దించుదామని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
Sep 10, 2018 11:53 AM
Narendra Modi ji is silent, he has not spoken a word on rising prices of fuel, or condition of farmers, neither on atrocities against women: Rahul Gandhi during #BharathBandh protests in Delhi pic.twitter.com/wURfFTXT1i
మహిళలపై దాడుల గురించి, పెరుగుతున్న పెట్రో ధరల గురించి, రైతుల సమస్యల గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడం లేదని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు.
భారత్ బంద్లో భాగంగా లోకతంత్రిక్ జనతా దళ్ వర్కర్స్ తమ భుజాలపై మోటార్ బైక్ను మోసి నిరసన తెలిపారు.
Sep 10, 2018 11:11 AM
Modi government has done a number of things that were not in the interest of the nation. The time to change this government will come soon: Former prime minister Manmohan Singh at Congress & opposition parties protest against fuel price hike #BharatBandhpic.twitter.com/t4Fvf5X4G8
మోడీ ప్రభుత్వంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిప్పులు చెరిగారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం దేశానికి ఉపయోగపడని ఎన్నో కార్యక్రమాలు చేసిందని మండిపడ్డారు.
ముంబై అంధేరీ రైల్వే స్టేషన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల రైల్ రోకో.
Sep 10, 2018 10:19 AM
Delhi: Sonia Gandhi and former prime minister Manmohan Singh join Congress-led opposition parties supported bandh protest against fuel price hike. #BharatBandhpic.twitter.com/u5W6hfJzAJ
ఢిల్లీలో జరిగిన పెట్రో వ్యతిరేక ఆందోళనలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, శరద్ పవార్, శరద్ యాదవ్ తదితరులు.
Sep 10, 2018 9:37 AM
జంగారెడ్డిగూడెంలో ఉదయం నుంచి బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. ఆర్టీసి డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు.
Sep 10, 2018 9:36 AM
Security has been tightened in Jaipur over #BharatBandh. Police says, "Precautionary measures have been taken. Police have been directed to take stringent actions against the protesters who will restore to violence during protests." #Rajasthanpic.twitter.com/DWbxHRYPxK
నిరసనకారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే, హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జైపూర్ పోలీసులు తెలిపారు.
Sep 10, 2018 9:19 AM
శ్రీకాకుళం జిల్లాలో బంద్ ప్రభావం పాక్షికంగా ఉంది. తెల్లవారుజాము నుంచే బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి.
Sep 10, 2018 9:18 AM
Delhi: Congress President Rahul Gandhi and opposition party leaders march from Rajghat towards Ramlila Maidan, to protest against fuel price hike. #BharatBandhpic.twitter.com/X7DQcVRgIA
ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఇతర విపక్షాలు రాజ్ ఘాట్ నుంచి రామ్ లీలా మైదాన్కు మార్చ్ చేసారు.
Sep 10, 2018 9:17 AM
Jan Adhikar Party Loktantrik workers block railway tracks in Patna's Rajendra Nagar Terminal railway station in support to #BharatBandh that has been called by Congress and other opposition parties today over fuel price hike. pic.twitter.com/tFTmCOrXqe
భారత్ బంద్లో పాల్గొనేందుకు రాజ్ ఘాట్ వస్తున్న ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ.
Sep 10, 2018 8:36 AM
విజయవాడ బస్టాండ్ వద్ద వివిధ పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. బంద్కు మద్దతుగా నగరంలోని విద్యా, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. గుంటూరులో వామపక్ష, జనసేన నిరసన తెలిపాయి. బస్టాండ్ వద్ద బస్సులను అడ్డుకోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Sep 10, 2018 8:35 AM
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఈ బంద్కు పలు పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా పలుచోట్ల అడ్డుకున్నారు.
Sep 10, 2018 8:32 AM
#BharatBandh: Extra deployment of forces has been done across the city today. Firm action will be taken on any miscreants taking the law into their hands, tweets Commissioner Of Police, Pune City, Dr Venkatesham K. (File pic) #Maharashtrapic.twitter.com/DCzAUxCofG
పుణేలో అదనపు బలగాలను మోహరించామని, ప్రశాంతంగా భారత్ బంద్ నిర్వహించుకోవచ్చునని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే మాత్రం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Sep 10, 2018 8:17 AM
నేటి ఓయూ పరీక్షలు వాయిదా పడ్డాయి.
Sep 10, 2018 8:10 AM
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో భారత్ బంద్లో పాల్గొన్న సీపీఎం, సీపీఐ, జనసేన కార్యకర్తలు, నేతలు.
Sep 10, 2018 7:42 AM
Telangana: Congress workers hold protests in Yadadri Bhuvanagiri district's Bhongir (pic 1) and Musheerabad bus depot (pic 2) in Hyderabad, against fuel price hike #BharatBandhpic.twitter.com/cVoIXXJbNr
తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలో రోడ్లపై నిరసన తెలిపారు. ముషీరాబాద్ బస్సు డిపో ఎదుట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు బస్సులు బయటకు రాకుండా కూర్చున్నారు.
Sep 10, 2018 7:34 AM
భారత్ బంద్ రోజు కూడా పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగాయి.
Sep 10, 2018 7:34 AM
పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని పలువురు నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు.
Sep 10, 2018 7:21 AM
పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో బంద్ ప్రభావం బాగా కనిపించింది. రోడ్లన్నీ బోసిపోయాయి.
Sep 10, 2018 7:19 AM
Kalaburagi: Bus services of North Eastern Karnataka Road Transport Corporation (NEKRTC) aren't operational today as #BharathBandh has been called by Congress and other opposition parties against fuel price hike. #Karnatakapic.twitter.com/raLOb95uuR
ఒడిశాలోని భువనేశ్వర్లో భారత్ బంద్ కు మద్దతుగా బైక్ ర్యాలీ, రోడ్లపై పేపర్ చదువుతూ నిరసన, రైల్ రోకో దృశ్యం.
Sep 10, 2018 7:08 AM
కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
Sep 10, 2018 7:07 AM
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు బందులో పాల్గొంటున్నాయి. రాయలసీమ యూనివర్సిటీలో నేటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేశారు. వామపక్షాలు, జనసేన, ఇతర పార్టీలు బస్టాండ్ల వద్ద కూర్చున్నాయి.
Sep 10, 2018 7:02 AM
Odisha: Congress workers block a train in Sambalpur as #BharathBandh has been called by Congress and other opposition parties today over fuel price hike pic.twitter.com/7rXobOCT7L
పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన.
Sep 10, 2018 6:59 AM
తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి బంద్లో పాల్గొననున్నారు. జూబ్లీహిల్స్లో జనసేన నిరసన తెలియజేయనుంది.
Sep 10, 2018 6:52 AM
యూపీఏ హయాంలో ఏటా ద్రవ్యోల్బణం పది శాతం వరకు పెరుగుతూ వచ్చిందని, ప్రజలు అప్పుడు ఎన్నో బాధలుపడ్డారని, మోడీ ప్రభుత్వం మాత్రం ద్రవ్యోల్బణ రేటును ఐదు శాతానికి మించనివ్వలేదని, చమురు ధరల కట్టడిపైనా కేంద్రం చర్చలు జరుపుతోందని, విధాన నిర్ణయాల దిశగానూ అడుగులు పడుతున్నాయని జవదేకర్ తెలిపారు.
Sep 10, 2018 6:50 AM
ధరల కట్టడికి అవసరమైన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. త్వరలో చమురు ధరలపై విధానం తీసుకొస్తామన్నారు.
Sep 10, 2018 6:47 AM
తెలంగాణ, ఏపీలలో బంద్ ప్రభావం కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులు బయటకు రాలేదు. విజయవాడలో బంద్లో కాంగ్రెస్, లెఫ్ట్తో పాటు జనసేన పాల్గొంది. జనసేన కూడా బంద్కు మద్దతు పలికింది.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more