ఏమీ భూపతి.. బైక్ కోసం 2 లక్షలకు పైగా చిల్లర పోగేశాడు.. షోరూం సిబ్బంది అపసోపాలు
చిత్ర, విచిత్రాలు జరుగుతుంటాయి. అవును కొందరు అలా చేస్తుంటారు. అంటే వారు చేసే పని మంచి ఉద్దేశంతో అయినా.. వార్తల్లో నిలుస్తుంటారు. తమిళనాడుకు చెందిన ఓ యువకుడు కూడా అలానే చేశాడు. కానీ అతని వల్ల షోరూం సిబ్బంది.. 10 గంటలు కష్టపడ్డారు. బైక్ కొనాలనేది అతని మూడేళ్ల డ్రీమ్.. బైక్ కోసం డబ్బులు కూడబెట్టాడు. అయితే అన్నీ చిల్లర నాణేలే.. రూపాయి నాణాలను మూడేళ్లుగా సేకరిస్తూ వచ్చాడు. రూ.2.6 లక్షలు పోగేశాడు. ఆ చిల్లరతో నేరుగా బైక్ షోరూం వద్దకు చేరుకుని తనకు నచ్చిన కొత్త బజాజ్ డామినార్ బైక్ కొనుగోలు చేశాడు.

డ్రీమ్ ఇలా..
తమిళనాడు సేలంకు చెందిన భూపతి బైక్ కొనాలనే డ్రీమ్ ఇలా నెరవేర్చుకున్నాడు. బైక్ షోరూంకు నాణేలలో చేరుకున్నాడు. రూపాయి నాణేలను లెక్కించలేక షోరూం సిబ్బంది ఇబ్బంది పడ్డారు. అతను తీసుకొచ్చిన చిల్లర నాణేలను లెక్కించేందుకు 10 గంటల సమయం పట్టింది. ఈ మేరకు భారత్ ఏజెన్సీ మేనేజర్ మహావిక్రాంత్ తెలిపారు.

బీసీఏ చేసి..
భూపతి బీసీఏ చేశాడు. నాలుగేళ్ల క్రితం యూట్యూబ్ ఛానెల్ని ప్రారంభించే ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశాడు. బైక్ ఖరీదు రూ.2 లక్షలు ఉంది. తన డ్రీమ్ బైక్ కొనాలని డిసైడ్ అయ్యాడు. మూడేళ్ల క్రితం నుంచే ఒక రూపాయి నాణేలను సేకరించాడు. రూ.2లక్షలపైగా పోగోయ్యాక ఆ చిల్లర నాణేలతో బైక్ షోరూంకు వెళ్లి నచ్చిన బైక్ కొన్నాడు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

10 గంటలు అంటే
భూపతి చేసింది.. మూమ్మాటికీ కరెక్టే.. కానీ చిల్లర లెక్కబెట్టలేక షోరూం సిబ్బంది తెగ ఇబ్బంది పడ్డారు. అవును స్టాప్ మొత్తం కూర్చొని.. 10 గంటల పాటు లెక్కిస్తే కానీ కొలిక్కి రాలేదు. అంటూ డ్యూటీ అవర్స్.. ఒకరోజు.. అంతకన్నా ఎక్కువే పట్టింది. ఉదయం 9 గంటలకు వచ్చినా సాయంత్రం 7 గంటలకు లెక్కింపు ప్రక్రియ పూర్తయిపోయింది. ఆ తర్వాత అతనికి బైక్ డెలివరీ చేశారు. అప్పుడు అతని ఆనందానికి అవది లేకుండా పోయింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications