థర్డ్ ఫేజ్ పోలింగ్: 78 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్..
మరికొన్ని గంటల్లో బీహర్ థర్డ్ ఫేజ్ పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటలకు 78 నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలవబోతోంది. 2.34 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. బరిలో 1204 మంది అభ్యర్థులు, స్పీకర్, 12 మంది మంత్రులు ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికలతోపాటు వాల్మీకి నగర్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఇక్కడ జేడీయూ ఎంపీ బైద్యనాథ్ మహతో చనిపోవడంతో బై పోల్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ జేడీయూ నుంచి అతని కుమారుడు సునీల్ కుమార్ బరిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ప్రవీణ్ కుమార్ మిశ్రా పోటీలో ఉన్నారు.

కోసి సీమాంచల్ ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతం. ఇక్కడ ఎంఐఎం తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇక్కడ మాజీ ఎంపీ పప్పు యాదవ్ ఎక్కువగా ప్రభావం చూపిస్తారు. అయితే జేడీయూ, ఆర్జేడీ మధ్య ఎక్కువగా పోటీ ఉంది. ఎల్జేపీ నుంచి చిరాగ్ పాశ్వాన్ కూడా ఓట్లను చీల్చే అవకాశం ఉంది.
ఈ సారి నితీశ్ కుమార్ ఎక్కువగా ప్రచారం చేశారు. ప్రధాని మోడీ కూడా ఎక్కువ ర్యాలీలలో పాల్గొని.. ఎన్డీఏను గెలిపించాలని కోరారు. కానీ ఓటరు ఎవరికీ పట్టం కట్టనున్నారో మంగళవారం తెలియనుంది.












Click it and Unblock the Notifications