Bihar assembly election 2020: 55 బూతులలో పోలింగ్ క్యాన్సిల్ చేయండి, ఆర్జేడీ అభ్యర్థి డిమాండ్
బీహర్ తొలి విడత ఎన్నిక కొనసాగుతోంది. అయితే ఓటేసేందుకు వయోజనులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఉదయం నుంచే పోలింగ్ మందకొడిగా సాగుతోంది. అన్నీ పోలింగ్ కేంద్రాల్లో కరోనా వైరస్ కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఓటింగ్ నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల ఆడపా దడపా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
Recommended Video
జముయ్ నియోజకవర్గంలో కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దాదాపు 55 పోలింగ్ బూతులలో ఇబ్బంది కలుగుతోంది. దీంతో అక్కడి ఆర్జేడీ అభ్యర్థి విజయ్ ప్రకాశ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఆ బూతులలో పోలింగ్ క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయా చోట్ల ఈవీఎం రీ ప్లేస్ చేసినా ఎందుకు పనిచేయడం లేదన్నారు. ఈవీఎం పనిచేయకపోవడానికి కారణం ఎవరూ అని అడిగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బాధ్యత లేదా అని అడిగారు.

71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.01 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 599 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. ఆర్జేడీ నుంచి 42 మంది, జేడీయూ నుంచి 35, బీజేపీ 29 మంది, 21 కాంగ్రెస్, 8 మంది లెప్ట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇతరులతో కలిపి మొత్తం 1066 మంది భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. వచ్చేనెల 3వ తేదీన రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. 7వ తేదీన మూడో విడత ఎన్నికలతో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తారు. వచ్చేనెల 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోతోంది.












Click it and Unblock the Notifications