బీహార్ లో ప్రశాంత్ కిషోర్ అనూహ్య ఎత్తుగడ..! కింగ్ మేకర్ అవుతారా ?
బీహార్ అసెంబ్లీకి వచ్చే నెలలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే నెల 6, 11 తేదీల్లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో ప్రధాన పోటీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి, ఆర్జేడీ నేతృత్వంలోని ఇండియా కూటమికీ మధ్యనే ఉందన్న వార్తల మధ్య జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా పావులు కదుపుతున్నారు.
రాజకీయ వ్యూహకర్త కూడా అయిన ప్రశాంత్ కిషోర్ ముందు నుంచీ ఎన్డీయే, ఇండియా కూటములకు దూరంగా ఉంటాననే చెప్తున్నారు. ఇప్పుడు అందుకు అనుగుణంగానే గతంలో ఎన్డీయే కూటమిలో ఉండి తాజాగా దూరమైన లోక్ జన్ శక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ కు దగ్గరయ్యారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోని జన్ సురాజ్ పార్టీ , చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జన శక్తి పార్టీలు పొత్తు కోసం చర్చలు జరుపుతున్నాయి.

వచ్చే నెలలో జరిగే బీహార్ ఎన్నికలకు చిరాగ్ పాశ్వాన్-ప్రశాంత్ కిషోర్ మధ్య పొత్తును తోసిపుచ్చలేమని లోక్ జనశక్తి పార్టీ వర్గాలు తాజాగా వెల్లడించాయి. రాజకీయాల్లో ఎల్లప్పుడూ తలుపులు తెరిచి ఉంటాయని లోక్ జనశక్తి పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న పాశ్వాన్ , ప్రశాంత్ కిషోర్ ల మధ్య కొంతకాలంగా సీట్ల పంపకాలు జరుగుతున్నట్లు తెలిపాయి.
దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

బీహార్ లోని షహాబాద్ ప్రాంతం నుండి పోటీ చేయాలని భావిస్తున్న పాశ్వాన్ .. అసెంబ్లీలో ఉన్న 243 అసెంబ్లీ సీట్లలో 40 సీట్లు కావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన ఐదు సీట్లూ గెలిచిన పాశ్వాన్ పార్టీ.. ఇప్పుడు 40 సీట్లలో పోటీకి సిద్దమవుతోంది. మిగతా సీట్లలో ఎన్ని పోటీ చేయాలన్న దానిపై ప్రశాంత్ కిషోర్ చర్చిస్తున్నారు. అయితే వీరిద్దరూ కూటమి కట్టినా తమకు వచ్చిన ముప్పేమీ లేదని బీజేపీ చెబుతోంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications