అసెంబ్లీ ఎన్నికలు: పాట్నాలో భారీగా బాంబులు సీజ్
పాట్నా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీహార్ రాజధాని పాట్నాలో భారీగా పేలుడు పదార్థాలు, బాంబులు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పాట్నా నగర ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురైనారు.
రానున్న సెప్టెంబర్ నెలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటి నుండి పలుచోట్ల సోదాలు చేస్తున్నారు. అనుమానం రావడంతో పలువురుని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

పాట్నాలోని పలుచోట్ల సుమారు 100 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 12 బాంబులు, 52 టైమర్ లు, పది కిలోల అమ్మోనియం న్రైట్రేట్, 7 రిమోట్లు, రెండు సెన్సార్లు, 100 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు.
వెంటనే జాతీయ భద్రత బలగాలు, బాంబు స్క్వాడ్ బృందాలకు సమాచారం అందించారు. అయితే ఈ పేలుడు పదార్థాలు మావోయిస్టులకు చెందినవని ఇంటిలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. పేలుడు పదార్థాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎవ్వరిని అరెస్టు చెయ్యలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications