ఆరారియాలో ఆర్జెడీ విజయంపై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్య
ముంబై: బీహార్లోని ఆరారియా లోకసభ ఉప ఎన్నికల్లో ఆర్జెడీ విజయం సాధించడంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గురువారంనాడు వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆరారియా జిల్లా ఉగ్రవాద హబ్గా మారుతుందని ఆయన వ్యాఖ్యానించార.
ఆరారియా ఫలితం రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ప్రమాదకరమని అన్నారు. అది నేపాల్, బెంగాల్ సరిహద్దు ప్రాంతమనే కాదు, దీని తర్వాత సనాతన మనస్తత్వం ఏర్పడిందని, ఇది బీహార్కు మాత్రమే కాకుండా దేశానికి కూడా ప్రమాదకరమని అన్నారు.

ఆర్జెడీ రెండు మైనారిటీల ఆధిపత్యం గల నియోజకవర్గాల్లో ఆర్జెడీకి లక్షా 30 వేల మెజారిటీ వచ్చిందని, దానివల్ల ఆరారియాలో ఆర్జెడి గెలిచిందని బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే బుధవారంనాడు అన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో తన వ్యాఖ్యలను పోస్టు చేశారు.
గిరిరాజ్ సింగ్, సుశీల్ కుమార్ సింగ్ వ్యాఖ్యలను బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జెడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి తిప్పికొట్టారు. మోడీ మానియా, హర్ హర్ మోడీ, ఘర్ ఘర్ మోడీ కేకలు ఆవిరిపోయాయని, అందుకే వారు రెచ్చిపోతున్నారని ఆమె అన్నారు.
గిరిరాజ్ సింగ్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఆరారియా, బీహార్ ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. ఆరారియా ప్రజలు వారిని క్షమించరని, ఆరారియా ప్రజల ఉగ్రవాదులా అని ఆమె మండిపడ్డారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications