శూన్యం నుంచి శిఖరానికి! భయాన్ని జయించారు: ఈశాన్య ఫలితాలపై మోడీ ఆనందోత్సాహం
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనూహ్యమైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆనందం వ్యక్తం చేశారు. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడిన విషయం తెలిసిందే.
త్రిపురలో బీజేపీ ఘన విజయం దాదాపు ఖరారైపోయింది. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలియజేశారు.
ప్రజల విశ్వాసం
ఎన్నికల ఫలితాలపై తన ఆనందాన్ని వరుస ట్వీట్లలో వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. ఎన్నికలు మారుతున్నా.. ఎలాంటి సమయంలోనైనా ఎన్డీయే ప్రభుత్వం, తమ అభివృద్ధి అజెండాలపై ప్రజలు విశ్వాసం చూపిస్తున్నారని మోడీ అన్నారు. మోసపూరిత, ప్రతికూల రాజకీయాలను ప్రజలు ఎన్నటికీ గౌరవించరని ఆయన చెప్పారు.
మీకో అహర్నిశలు
‘త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్లో ప్రజలు తమ తీర్పును ఇచ్చారు. బీజేపీ అభివృద్ధి అజెండాలో ఒకటైన ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ'కి, మా కూటమి పార్టీలకు మద్దతిచ్చినందుకు ఈ రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడి ప్రజల కోరికలు, ఆశయాలను నెరవేర్చేందుకు అహర్నిశలు పాటుపడుతాం' అని మోడీ తెలిపారు.
మాటలు సరిపోవు..
అంతేగాక, ‘2018 త్రిపుర ఎన్నికలు నవశకానికి నాంది పలికాయి. త్రిపుర సోదర, సోదరీమణులు అద్భుతం చేశారు. వారికి కృతజ్ఞతలు చెప్పేందుకు మాటలు సరిపోవడం లేదు. త్రిపురలో మార్పు తీసుకొచ్చేందుకు మేం ఏ మార్గాన్ని వదిలిపెట్టబోం' అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
శూన్యం నుంచి శిఖరానికి..
‘త్రిపురలో విజయం సాధారణ ఎన్నికల విజయం కాదు. శూన్యం నుంచి శిఖరానికి చేరుకున్నాం. ఇందుకు అభివృద్ధి అజెండాలు ఎంతగానో దోహదం చేశాయి. దీన్ని సుసాధ్యం చేసేందుకు ఏళ్ల తరబడి శ్రమిస్తున్న ప్రతి బీజేపీ కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ రోజు శాంతి, అహింస కలిసి భయాన్ని ఓడించాయి. త్రిపుర ప్రజలకు సరైన పాలన అందిస్తాం. మేఘాలయ, నాగాలాండ్లలోనూ బీజేపీకి మద్దతిచ్చినందుకు సంతోషంగా ఉంది. వారందరికీ కృతజ్ఞతలు' అని మోడీ తెలిపారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!












Click it and Unblock the Notifications