కాంగ్రెస్, బీజేపీ కన్నా ఎస్పీ, బీఎస్పీ మేలు : తప్పుడు వార్తలపై ఆక్స్ ఫర్ట్ పరిశోధకులు
న్యూఢిల్లీ : ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. కానీ ఎస్పీ, బీఎస్పీ మాత్రం తప్పుడు వార్తలు కాకుండా ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తోందని ఆక్స్ ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు చేపట్టిన సర్వేలో తెలిపారు. అంతేకాదు ఒకడుగు ముందేసిన బీజేజీ విభజన, కుట్రపూరిత చిత్రాలను వాట్సాప్ లో షేర్ చేస్తోందని కఠోర వాస్తవాన్ని వెల్లడించింది. ఇందులో కాంగ్రెస్ పావాలా శాతంతో ఉండగా .. ఎస్పీ, బీఎస్పీ చిత్రాలు పదోవంతులో ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.
ఇదీ డేటా ...
బీజేపీ 35 శాతం వాట్సాప్ సందేశాలు విభజన, కుట్రపూరితంగా ఉంటాయని ఆక్స్ ఫర్ట్ ఇంటర్నెట్ రీసర్చర్ విద్య నారాయణ్ తెలిపారు. ఇందులో 18 శాతం మాత్రమే ప్రచారం, మద్దతు కోసం ఉంటుందని పేర్కొన్నారు. 10.5 శాతం జాతీయం, సైనికుల మద్దతు కోసం ఉంటుందని .. 3.5 మతం, 3.5 సెట్లైర్లు ఉంటాయని వివరించింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రచారం, మద్దతు అంశాల గురించి 30 శాతం ప్రస్తావిస్తుందని గుర్తుచేశారు. విభజన, కుట్రపూరిత సందేశాలు కేవలం 28.5 శాతం మాత్రమే ఉంటాయని స్పష్టంచేశారు. ఆ పార్టీలో సెటైర్లు 9 శాతం మాత్రమే ఉంటాయని ... మిగతా విభాగాలు కేవలం 5 శాతం ఉంటాయని తెలిపారు.
ఎస్పీ, బీఎస్పీ మేలు ..
ఇక ఎస్పీ, బీఎస్పీ విభాగానికి వస్తే ఎన్నికల్లో ప్రచారం, మద్దతు కోసం 20.5 కేటాయిస్తే ... 11.5 విభజన, కుట్రపూరిత అంశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీల జాతీయం, ఆర్మీకి మద్దతు 7.5 శాతం ఉన్నదని ... మిగతా విభాగాలు కేవలం 4 శాతంగా ఉందని తెలిపారు. ఇక ఫేస్ బుక్ లింకుల విషయానికొస్తే 40 శాతం ప్రొఫెషనల్ అంశాలు ఉంటాయని .. జంక్ న్యూస్ 28 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అది 21 శాతంగా ఉంటుందని తెలిపారు. అయితే బీఎస్పీ, ఎస్పీ మాత్రం ఈ రెండు పార్టీల కన్నా ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తాయని గుర్తుచేశారు. కేవలం 1 శాతం తప్పుడు వార్తలు ఉంటాయని పేర్కొన్నది.
ఫొటోల డేటా
ఫేస్ బుక్ చిత్రాల విషయానికొస్తే 12 శాతం జంక్ అని .. కాంగ్రెస్ మాత్రం 14 శాతం ప్రచారం, మద్దతు అంశాలు ఉంటాయని వెల్లడించారు. ఎస్పీ బీఎస్పీలో కూడా 12 శాతం జంక్ ఫోటోలు ఉంటాయని పేర్కొన్నారు.