పౌరసత్వ చట్టానికి సానుకులం!: గతంలో మన్మోహన్ సింగ్ ఏమన్నారంటే.?(వీడియో)
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో పార్లమెంటులో చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 2003లో మన్మోహన్ సింగ్ రాజ్యభలో ఈ చట్టానికి అనుకూలంగా మాట్లాడిన వీడియో క్లిప్ను భారతీయ జనతా పార్టీ తన అధికారిక ట్విట్టర్లో ఖాతాలో షేర్ చేసింది.
ప్రస్తుత చట్టానికి సానుకూలంగా 2003లోనే మన్మోహన్..
ఈ వీడియోలో.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వచ్చిన మైనార్టీలకు పౌరసత్వం కల్పించడానికి మద్దతుగా మన్మోహన్ మాట్లాడారు. ప్రస్తుతం బీజేపీ కూడా అదే చట్టం చేసిందని బీజేపీ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ‘2003లో రాజ్యసభలో నాటి ప్రతిపక్ష నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల్లో మతపరమైన హింసకు గురైన మైనార్టీలకు పౌరసత్వం కల్పించే విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలి' అని మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రస్తుం కేంద్ర ప్రభుత్వం కూడా అదే చేసిందని బీజేపీ పేర్కొంది. అయితే ఇప్పుడు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

ఉదారంగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతూ..
‘నేను శరణార్థులకు సంబంధించి ఒక విషయం చెప్పదల్చుకున్నాను. దేశ విభజన తర్వాత బంగ్లాదేశ్ వంటి దేశాల్లోని మైనార్టీలు మతపరమైన హింసను, పీడనను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో పరిస్థితుల ప్రభావంతో వారంతా శరణార్థులుగా మనదేశానికి వస్తే పౌరసత్వం కల్పించడంపై మరింత ఉదారంగా వ్యవహరించాలి. ఉపప్రధానమంత్రి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో దానికనుగుణంగా పౌరసత్వ చట్టాన్ని రూపొందిస్తారని భావిస్తున్నా' అని మన్మోహన్ సింగ్ ఆ వీడియోలో ప్రభుత్వాన్ని కోరారు.

ఇప్పుడెందుకిలా?
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. అప్పుడు మన్మోహన్ సింగ్ సమర్థించిన చట్టాన్నే తాము తెచ్చామని.. అప్పుడు సమర్థించి.. ఇప్పుడు వ్యతిరేకించడం ఏంటని బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తున్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో హింసను ఎదుర్కొని అక్కడ బతకలేని పరిస్థితుల్లో మనదేశానికి శరణార్థులుగా వచ్చే మైనార్టీలకు భారత పౌరసత్వం కల్పించే విధంగా తాజాగా పౌరసత్వ సవరణ చట్టం కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications