మోడీ మార్క్: హార్దిక్ పటేల్ కు షాక్: గుజరాత్ ఎన్నికల్లో పటేళ్లకు ప్రధాన్యత, ఐదో జాబితా !
గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ప్లాన్ వేస్తున్న కమలనాథులు పలు కొత్త ముఖాలను తెర మీదకు తీసుకు వస్తున్నారు. మోడీ మార్క్ తో శుక్రవారం బీజేపీ అధిష్టానం ఐదో జాబితాను విడుదల చేసింది. హా
అమ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ప్లాన్ వేస్తున్న కమలనాథులు పలు కొత్త ముఖాలను తెర మీదకు తీసుకు వస్తున్నారు. మోడీ మార్క్ తో శుక్రవారం బీజేపీ అధిష్టానం ఐదో జాబితాను విడుదల చేసింది. హార్దిక్ పటేల్ కు షాక్ ఇస్తూ ప్రముఖ పటేల్ వర్గం నాయకులకు ప్రధాన్యత ఇచ్చి వారిని బరిలోకి దింపింది.
Recommended Video
హార్దిక్ పటేల్ ఒక ఫూల్: మూర్ఖులు మరి కొందరు మూర్ఖులకు హామీ ఇచ్చారు: డీసీఎం ఫైర్!
పటేల్ వర్గం నేతలు వల్లభ్ భాయ్ కకాడియాను తక్కర్ బపనగర్, పంకజ్ భాయ్ దేశాయ్ ను నడియాద్ నియోజక వర్గం నుంచి మరోసారి బరిలోకి దింపారు. పటేల్ వర్గానికే చెందని మావ్జీబాయ్ దేశాయ్ ను ధనేరా నియోజక వర్గం, విజయ్ భాయ్ చక్రవర్తిని వద్గాం నియోజక వర్గం నుంచి బరిలోకి దింపారు.
గుజరాత్ స్పీకర్ రామ్ లాల్ ఓహ్రా ఇదార్ నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఈ సారి స్పీకర్ స్థానంలో ప్రముఖ గుజరాతీ నటుడు, బీజేపీ ఎమ్మెల్యే నరేష్ కనోడియా కుమారుడు హితేష్ భాయ్ కనోడియాను బరిలోకి దింపారు. పంచ్ మహల్ నియోజక వర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన అరవింద్ సింహ్ రాథొడ్ ను ఈ సారి పక్కన పెట్టారు.
గుజరాత్ ఎన్నికలు, నరేంద్ర మోడీ ప్రచారం, డేట్ ఫిక్స్, ప్రధానికి పోటీగా రాహుల్ గాంధీ ర్యాలీలు!
ఎమ్మెల్యే అరవింద్ సింహ్ రాథోడ్ స్థానంలో గోద్రా ఎంపీ ప్రభాత్ సింహ్ చౌహాన్ కోడలు సుమన్ బెన్ చౌహాన్ కు అవకాశం కల్పించారు. గుజరాత్ లోని 182 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటి వరకు బీజేపీ 147 మంది అభ్యర్థులను ప్రకటించింది. డిసెంబర్ 9, 14వ తేదీల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రధాని మోడీ మార్క్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆచితూచి అడుగులు వేస్తూ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.