వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బీజేపీ నేత దారుణ హత్య: మావోయిస్టుల పనేనా?
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భోపాలపట్నంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు జగదీష్ కొండర దారుణ హత్యకు గురయ్యారు. మావోయిస్టులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి.
భోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధికి సుమారు 300 మీటర్ల దూరంలోనే జగదీష్ హత్యకు గురయ్యారు. అయితే జగదీష్ని ఎవరైనా పాతకక్షలతో హత్య చేశారా..? లేక మావోయిస్టులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ విషయమై బీజాపూర్ జిల్లా ఎస్పీ దృవ్ని వివరణ కోరగా.. జగదీష్ హత్యకు గురైన విషయం వాస్తవమేనని తెలిపారు. ఇది మావోయిస్టులు చేసిన పని అని ఇంకా నిర్ధారించలేదని ఆయన చెప్పారు. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Comments
English summary
A Bharatiya Janata Party (BJP) leader in Chhattisgarh's Bijapur district was hacked to death, police said on Tuesday.