రాహుల్ ఎంతో మారిపోయాడు-ప్రతీదీ ఓ సంకేతమే-స్మృతీ ఇరానీ పొగడ్తలు..!
ఒకప్పుడు కాంగ్రెస్ యువరాజుగా ప్రత్యర్థులు విమర్శలు చేసిన రాహుల్ గాందీ ఇప్పుడు లోక్ సభలో ప్రతిపక్ష నేత హోదాలో దుమ్మురేపుతున్నారు. గతంలో పార్లమెంట్ కు రాడని విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ ఇప్పుడు రెగ్యులర్ గా హాజరవుతూ అధికార పక్షంపై దీటుగా విమర్శలు చేస్తున్నారు. ఇదంతా ఆయనలో వచ్చిన మార్పుకు సంకేతంగా దేశంలో మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు. అయితే ఇందులో ఇప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్థి, గతంలో ఆయన్ను ఓడించిన స్మృతీ ఇరానీ కూడా చేరిపోయారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాజీ కేంద్రమంత్రి స్మృృతీ ఇరానీ రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించారు. రాహుల్ లో వచ్చిన మార్పుపై అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానాలు ఇప్పుడు సొంత పార్టీ బీజేపీ నేతలకు సైతం షాకిచ్చాయి. ఒకప్పుడు అమేథీలో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతీ ఇరానీ తాజా ఎన్నికల్లో ఆయన ఆఫీసులో పనిచేస్తున్న కిషోరీ లాల్ శర్మ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో వచ్చిన మార్పో ఏమో తెలియదు కానీ స్మృతీ ఇరానీ రాహుల్ పై చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి.

Whether you like it or not, but Rahul Gandhi’s politics has changed.
— Shantanu (@shaandelhite) August 28, 2024
He is giving a message to the youths of the country through his white T-shirt.
— BJP leader Smriti Irani pic.twitter.com/qsdCIwFE2z
రాహుల్ గాందీ రాజకీయంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోందని స్మృతీ ఇరానీ వెల్లడించారు. తాను గెలుపు రుచి చూసినట్లు భావిస్తున్నాడన్నారు. రాహుల్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడికి వెళ్లినా కులం గురించి మాట్లాడుతున్నారని, అంతే కాదు రాజకీయాల్లో ఇదెంత కీలకమూ చూపిస్తున్నాడన్నారు. పార్లమెంట్ లో తెల్ల టీషర్ట్ వేసుకుని హాజరు కావడం ద్వారా యువతకు ఓ సందేశం ఇచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఇరానీ తెలిపారు. ఇదంతా మనకు నచ్చినా నచ్చకపోయినా భిన్నమైన రాజకీయం చేస్తున్నట్లు మాత్రం అనిపిస్తోందన్నారు.
-
మాటలతో, మూటలతో ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు - సీఎం రేవంత్ రెడ్డి -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!!












Click it and Unblock the Notifications