లేడీ కిమ్ ఎందుకు అడ్డుకుంటోంది..? మళ్లీ భగ్గుమన్న బెంగాల్
కోల్కతా: చాలాకాలం తర్వాత బెంగాల్లో మళ్లీ హింస చెలరేగింది. బీజేపీ తలపెట్టిన నబన్నా క్యాంపెయిన్లో భాగంగా ఈ హింస చెలరేగింది. బెంగాల్ విపక్ష నేత సువేంధు అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. క్యాంపెయిన్ ప్రారంభం కాకముందే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇటు పోలీసులకు అటు బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. సువేంధు అధికారితో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాకెట్ ఛటర్జీని కూడా పోలీసులు అరెస్టు చేశారు.వీరిని కోల్కతా పోలీస్ హెడ్క్వార్టర్స్కు తరలించారు.
మమతా బెనర్జీ ప్రభుత్వం అవినీతి పద్ధతులను అవలంబిస్తోందని బీజేపీ ఆరోపిస్తూ దీనికి నిరసనగా నబన్నా మార్చ్ను కాషాయం పార్టీ తలపెట్టింది. బీజేపీ పిలుపునివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు రైళ్లలో కోల్కతాకు చేరుకుంటున్నారు.దీంతో రైల్వే స్టేషన్కు వెళ్లే మార్గాలన్నిటినీ బారికేడ్లతో మూసివేశారు.ఇదిలా ఉంటే అరెస్టు చేసే సమయంలో మహిళా పోలీసులు కూడా సువేంధుపై చేయి వేయడంతో వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా పోలీసులు తనపై చెయ్యి ఎలా వేస్తారని ప్రశ్నించారు.ఆ ఏరియాలోని ఐపీఎస్ అధికారి వెంటనే రావాలంటూ ఆయన డిమాండ్ చేశారు. దీంతో దక్షిణ కోల్కతా డిప్యూటీ కమిషనర్ ఆకాష్ మఘారియా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయనతో సువేందు అధికారి వాగ్వాదానికి దిగారు.

మహిళా పోలీసులు తనను తాకుతున్నారని వారెలా ఇలా ప్రవర్తిసారంటూ ప్రశ్నించిన సువేందు అధికారి ఈ ఘటనపై కోర్టుకెళ్లనున్నట్లు వెల్లడించారు. ఇందుకు మహిళా పోలీసులు లేదా పురుష పోలీసులంటూ ఎలాంటి బేదము తమ ఫోర్స్లో లేదని డీసీపీ సమాధానం ఇచ్చారు.ఇదిలా ఉంటే మమతా బెనర్జీకి బీజేపీ అంటే చెమటలు పడుతున్నాయని అందుకనే తమ యాత్రను అడ్డుకుంటోందని లాకెట్ ఛటర్జీ మండిపడ్డారు."ప్రజాస్వామ్యంలో ఉన్నామా మరెక్కడైనా ఉన్నామా... నన్నెందుకు అడ్డుకుంటున్నారు. అరాచకానికి కూడా ఓ హద్దుంటుంది.లేడీ కిమ్కు చెప్పండి, మిడ్నాపూర్ భారత్లోనే ఉందని. బెంగాల్ను మమతా ఉత్తరకొరియాగా మార్చుతోంది" అంటూ సువేందు అధికారి బెంగాల్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదిలా ఉంటే 2021 తర్వాత అతిపెద్ద బీజేపీ మార్చ్గా నబన్న అభియాన్ యాత్ర నిలిచింది.రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొన్ని వేలమంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.హల్దియా నందిగ్రామ్లలో పోలీసులు బీజేపీ కార్యకర్తల వాహనాలను నిలిపివేశారు. బీజేపీ ప్రణాళిక ప్రకారం మూడు మార్గాల ద్వారా ఆ పార్టీ కార్యకర్తలు నబన్నా (సెక్రటేరియట్)ముట్టడి చేయాల్సి ఉంది.ఇక బీజేపీ తలపెట్టిన ఈ సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమంతో కోల్కతాలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు వాహనాలను దారి మళ్లించారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications