బీజేపీ సీనియర్ నేత ఉమా భారతికి కరోనా పాజిటివ్... ప్రస్తుతం క్వారెంటైన్లో...
కేంద్ర మాజీ మంత్రి,బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి కరోనా బారినపడ్డారు. గత మూడు రోజులుగా స్వల్ప జ్వరంతో బాధపడుతున్నానని... ఇటీవల హిమాలయాల పర్యటనకు వెళ్లినప్పుడు కరోనా సోకిందని అన్నారు. భౌతిక దూరం ఇతర కోవిడ్ నిబంధనలను పాటించినప్పటికీ కరోనా బారిన పడ్డట్లు తెలిపారు. శనివారం అర్దరాత్రి ఈ విషయాన్ని ఉమా భారతి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ప్రస్తుతం హరిద్వార్-రిషికేశ్ మధ్యలో ఉన్న వందేమాతరం కుంజ్లో క్వారెంటైన్లో ఉన్నట్లు ఉమా భారతి వెల్లడించారు. మరో నాలుగు రోజుల తర్వాత మళ్లీ కరోనా టెస్టులు చేయించుకుంటానని చెప్పిన ఉమా భారతి... ఒకవేళ అప్పుడు కూడా పాజిటివ్గా తేలితే వైద్యులను సంప్రదిస్తానని చెప్పారు. గత కొద్దిరోజులుగా తనను కలిసినవాళ్లు కరోనా టెస్టులు చేయించుకుని హోం క్వారెంటైన్లో ఉండాలని సూచించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ,కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్,కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్,కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. అగస్టు 18న కరోనాతో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన అమిత్ షా... అగస్టు 31న డిశ్చార్జి అయ్యారు. కేంద్రమంత్రి సురేష్ అంగడి,కర్ణాటక బీజేపీ ఎంపీ అశోక్ గస్తీ ఇటీవలే కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications