Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జేడీయూకు డిప్యూటీ స్పీకర్ పదవి? వైసీపీని బీజేపీ పక్కనబెట్టిందా?

ఢిల్లీ : లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఏ పార్టీకి కేటాయిస్తారన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. భాగస్వామ్య పక్షాలకు కాకుండా ఇతర పార్టీలకు ఆ పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీకి డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు అప్పజెప్తారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా రేసులో జేడీఎస్, బీజేడీల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో మోడీ వైసీపీని పక్కనబెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 డిప్యూటీ స్పీకర్ రేసులో వైసీపీ

డిప్యూటీ స్పీకర్ రేసులో వైసీపీ

లోక్‌సభలో అధికారపార్టీ తమకు అనుకూలంగా ఉండే మరో పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి అప్పగించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభలో బీజేపీకి అనుకూలంగా ఉంటూ సంఖ్యాబలం ఉన్న పార్టీ వైసీపీయే. ఈ నేపథ్యంలో ఆ పార్టీకే డిప్యూటీ పగ్గాలు అప్పగించే అవకాశముందన్న వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే వైసీపీ బహిరంగంగా మోడీ ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశం లేదు. ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తామన్న జగన్ ఎన్డీఏ సర్కారులో చేరితే ప్రజల్లో ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో భాగస్వామి కాకుండా డిప్యూటీ స్పీకర్ పదవి స్వీకరించి మోడీ సర్కారుకు వైసీపీ సహకరిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

 వైసీపీకే పక్కనబెట్టినట్లేనా?

వైసీపీకే పక్కనబెట్టినట్లేనా?

2021 వరకు రాజ్యసభలో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేదు. ఈ పరిస్థితుల్లో ఎగువ సభలో ఏవైనా బిల్లులు పాస్ కావాలంటే వైసీపీ తదితర పార్టీల మద్దతు అవసరం. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక జరిగితే ఆ సీట్లన్నీ వైసీపీ ఖాతాలోనే పడతాయి. ఈ నేపథ్యంలో జగన్ పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీ ఇవ్వజూపినట్లు తెలుస్తోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మోడీ ఈ విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

జేడీయూతో చెడిన దోస్తానా

జేడీయూతో చెడిన దోస్తానా

మంత్రివర్గంలో సరైన ప్రాధాన్యం లభించలేదన్న కారణంతో నితీశ్ నేతృత్వంలోని జేడీయూ బీజేపీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో బీహార్‌లో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలు ఘన విజయం సాధించాయి. అయితే ప్రస్తుతం అలకబూనిన నితీశ్‌ను ఒప్పించేందుకు డిప్యూటీ స్పీకర్ పోస్టును ఆ పార్టీకి ఇచ్చేందుకు మోడీ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. మరోవైపు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ సైతం డిప్యూటీ స్పీకర్ రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ పోస్టు జేడీయూకే దక్కే అవకాశముందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+