బీజేపీకి షాక్: శత్రుఘ్న సిన్హా ధిక్కారస్వరం
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అదే పార్టీకి చెందిన ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా మరో సారి షాక్ ఇచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రిన్సిపల్ కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయాలపై సీబీఐ దాడులు చేయడానికి ఇది సరైన సమయం కాదన్నారు.
సీబీఐకి దాడులు చెయ్యాలని ఎవరు సలహా ఇచ్చారు అనే విషయం తెలియడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో సమయం చాల విలువైనదని అన్నారు. అయితే ఈ టైంలో దాడులు చెయ్యడం సరికాదు అంటూ శత్రుఘ్న సిన్హా ధిక్కారస్వరం వినిపించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పాపులారిటీనే కాదు మాస్ ఫాలోయింగ్ కూడా ఎక్కవగా ఉందంటూ కితాబు ఇచ్చారు. ఇలాంటి సమయంలో సీబీఐ దాడులు చెయ్యడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే ప్రధాని నరేంద్ర మోడీ మీద అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను శత్రఘ్న సిన్హా ఖండించారు. ప్రధాని నరేంద్ర మోడీ పిరికిపంద, ఓ సైకో అంటూ అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించిన బాషను శత్రుఘ్నసిన్హా తప్పుబట్టారు. ఓ ముఖ్యమంత్రి ప్రధాని మోడీని ఆలా మాట్లాడరాదని సూచించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications