తృణమూల్ లోకి సుబ్రమణ్యస్వామి ? మమతతో భేటీ-ఆమెతోనే ఉన్నానంటూ వ్యాఖ్య
తన సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఇవాళ మరో సంచలనానికి తెరదీశారు. బీజేపీకి బద్ద విరోధి అయిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. అంతే కాదు మరిన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో ఆయన తృణమూల్ కాంగ్రెస్ లో చేరుతున్నారన్న ప్రచారం సాగుతోంది.
నిన్న పశ్చిమబెంగాల్లో గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్ తో భేటీ అయిన సుబ్రమణ్యస్వామి.. ఇవాళ ఢిల్లీలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలోని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇంట్లో ఈ భేటీ జరిగింది. ప్రధాని మోడీతో భేటీ కోసం మమతా బెనర్జీ తన పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీ వచ్చారు. ఈ సమయంలోనే సుబ్రమణ్యస్వామి వచ్చి ఆమెను కలవడం కలకలం రేపింది.

మమతా బెనర్జీతో భేటీపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సుబ్రమణ్యస్వామి స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ లో చేరుతున్నారా అని ప్రశ్నించగా... తాను ఇప్పటికే మమతా బెనర్జీతోనే ఉన్నానని వ్యాఖ్యానించారు. కొత్తగా తృణమూల్ లో చేరాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దీంతో ఆయన టీఎంసీలో చేరబోతున్నారనే ప్రచారం మరింత ఊపందుకుంది. గత నెలలో బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి సుబ్రమణ్యస్వామిని తప్పించారు. ఆ తర్వాత పలుమార్లు బీజేపీకి రాజకీయశత్రువైన మమతను ప్రశంసిస్తూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన టీఎంసీలో చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
Subramanian Swamy with West Bengal CM Mamata Banerjee after their meeting in Delhi. @IndianExpress pic.twitter.com/1tKDDEbIQl
— Sourav Roy Barman (@Sourav_RB) November 24, 2021
Recommended Video
మరోవైపు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇవాళ సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ అయి బీఎస్ఎఫ్ పరిధి పెంపు, త్రిపురలో టీఎంసీ కార్యకర్తలపై దాడులు వంటి పలు అంశాల్ని ప్రస్తావించబోతున్నారు. ఆ లోపే సుబ్రమణ్యస్వామితో భేటీ కావడం చర్చనీయాంశమవుతోంది.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications