ఆర్థిక నేరగాళ్ల సంగతి తేల్చండి ! .. యూపీలో ఎన్నికల వేళ.. ప్రధాని మోదీకి వరుణ్ గాంధీ సవాల్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ బీజేపీ ఎంపీ వరణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ఆర్థిక నేరగాళ్ల సంగతి తేల్చాలని ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఆర్థిక నేరాలకు పాల్పడున్నవారిపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిలదీశారు. బీజేపీ ఎంపీయే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. కమలం పార్టీకి యూపీ ఎన్నికల వేళ తీవ్ర తలనొప్పిగా మారింది.

అవినీతిపరులకు సకల సౌకర్యాలు
దేశంలో అవినీతిపరులు సకల సౌభాగ్యాలు అనువిస్తున్నారని ఎంపీ వరుణ్ గాందీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రుణగ్రస్థ భారతదేశంలో రోజుకు ఎంతో మంది అప్పులతో రైతులు, చేనేత కార్మికులు, పేదలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎంతో మంది పేదలు ఇళ్లు లేక రోడ్లపైనే జీవనాన్ని గడుపుతున్నారన్నారు. పేదల జీవితాల్లో వెలుగు నింపాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న సామాన్యులకు ఒక న్యాయం .. ఆర్థిక నేరస్తులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు.
ఆర్థిక నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోండి..
దేశంలో ప్రధానమైన బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పరారైన వ్యాపారవేత్తలు నీరవ్ మోదీ రూ.14,000 కోట్లు, విజయ్ మాల్యా రూ.9,000 కోట్లు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మరో కుంభకోణం బయపడిందని పేర్కొన్నారు. ABG షిప్యార్డు కంపెనీ మాజీ చైర్మన్ రుషి అగర్వాల్ భారీ కుంభకోణంలో ఇరుక్కున్నట్లు వార్తలు వస్తున్నాయని వెల్లడించారు. ఈ కుంభకోణం విలువ దాదాపు రూ.23,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా పేర్కొన్నారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ.. తన ట్విట్ లో ఫోస్ట్ చేశారు వరణ్ గాంధీ. బలమైన ప్రభుత్వం ఇటువంటి అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బీజేపీకి తలనొప్పిగా వరుణ్ గాంధీ వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ వరుణ్ గాంధీ వ్యాఖ్యలు బీజేపీని ఇరకాటంలో పడేశాయి. ఇటీవల మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు సక్రమంగా లేదని ఆరోపించారు. ఆందోళన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తాజా మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
-
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications