బిజెపి సమావేశాలు: ఫ్లెక్సీల్లోనూ తగ్గిన అద్వానీ హవా
బెంగళూరు: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను శుక్రవారం ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడి, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్.కే. అద్వాని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుండి 330 మంది నాయకులు ఈ కార్యక్రమానికి హాజరైనారు.
శుక్రవారం ఉదయం 10 గంటలకు బెంగళూరులోని లలిత్ అశోక్ హోటల్ లో వందేమాతరం గీతం ఆలపించి జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడి, సీనియర్ నాయకుడు ఎల్.కే. అద్వాని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు అరుణ్ జెట్లి, రాజ్ నాథ్ సింగ్ వేదిక మీద ఉన్నారు.
శుక్రవారం ఉదమం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. సాయంత్రం 5.30 గంటల సమయంలో నేషనల్ కాలేజ్ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
బహింరంగ సభలో నరేంద్ర మోడి, ఎల్.కే. అద్వాని, అమిత్ షా ప్రసంగించనున్నారు. నేషనల్ కాలేజ్ పరిసర ప్రాంతాలలో బీజేపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఎక్కడ చూసినా నరేంద్ర మోడి, అమిత్ షా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈసారి పార్టీ సీనియర్ నాయకుడు ఎల్.కే. అద్వానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన ఫోటోలు ఒక్కోక్క చోట మాత్రమే కనిపిస్తున్నాయి.