జమ్మూ కాశ్మీర్ సస్పెన్స్! బీజేపీ ఆఫీస్ ఇలా, కాంగ్రెస్ ఆఫీస్ అలా (పిక్చర్స్)
న్యూఢిల్లీ: జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దుమ్ము రేపింది. కాంగ్రెస్ పార్టీ చతికిలపడిపోయింది. జార్ఖండ్లో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తోంది. జమ్మూ కాశ్మీర్లో పీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
జార్ఖండ్లో బీజేపీ కూటమి 40 స్థానాలకు పైగా గెలుచుకొని, మేజిక్ ఫిగరా దాటే అవకాశముంది. కాంగ్రెస్, జేవీఎం తుడిచి పెట్టుకుపోయాయి. జేఎంఎం పార్టీ 18 సీట్లతో రెండో స్థానంలో ఉంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు జార్ఖండ్ ముఖ్యమంత్రిని రేపు నిర్ణయించనుంది.
జమ్మూ కాశ్మీర్లో బీజేపీ 25, పీడీపీ 28, ఎన్సీ 15, కాంగ్రెస్ 12 స్థానాలను గెలుచుకున్నాయి. పీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తొలుత అందరు భావించారు. కాని పీడీపీ బీజేపీతో కంటే కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకు సిద్ధమని చెబుతోంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ఎవరు జతకడతారోననేది చర్చనీయాంశమైంది.
ఒమర్ అబ్దుల్లా
నేషనల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లో సోనోవార్ నియోజకవర్గంలో ఓడిపోయి, చావుతప్పి కన్నులొట్టబోయినట్లు బీర్వాలో గెలుపొందారు.
పీడీపీ
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధిక స్థానాలు గెలుపొంది, అతిపెద్ద పార్టీగా అవతరించింది. నేషనల్ కాంగ్రెస్ ప్రొవిజనల్ ప్రెసిటెండ్ నాసిర్ అస్లామ్ వానీని ఓడించిన పీడీపీ అభ్యర్థి అట్లాఫ్ బుఖారీ విజయ చిహ్నం.
పీడీపీ
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధిక స్థానాలు గెలుపొంది, అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా, గెలుపొందిన నేషనల్ కాంగ్రెస్ అభ్యర్తి ఫిర్దోస్ విజయ చిహ్నం.
బీజేపీ
జార్ఖండ్లో బీజేపీ కూటమి 40 స్థానాలకు పైగా గెలుచుకొని, మేజిక్ ఫిగరా దాటే అవకాశముంది. బీజేపీ విజయం నేపథ్యంలో రాంచీలో కార్యకర్తలు టపాసులు కాలుస్తూ...
పీడీపీ
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధిక స్థానాలు గెలుపొంది, అతిపెద్ద పార్టీగా అవతరించింది. పీడీపీ కార్యకర్తల ఆనంద నినాదాలు.
కాంగ్రెస్
జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బోల్తా పడ్డ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశలో మునిగిపోయింది. బోసిపోతున్న ఢిల్లీలోని పార్టీ కార్యాలయం.
బీజేపీ
జార్ఖండ్లో బీజేపీ కూటమి 40 స్థానాలకు పైగా గెలుచుకొని, మేజిక్ ఫిగరా దాటే అవకాశముంది. జమ్మూ కాశ్మీర్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ విజయం నేపథ్యంలో ఢిల్లీలో కార్యకర్తలు టపాసులు కాలుస్తూ...
కాంగ్రెస్ కార్యాలయం
జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బోల్తా పడ్డ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశలో మునిగిపోయింది. బోసిపోతున్న ఢిల్లీలోని పార్టీ కార్యాలయం.
బీజేపీ
జార్ఖండ్లో బీజేపీ కూటమి 40 స్థానాలకు పైగా గెలుచుకొని, మేజిక్ ఫిగరా దాటే అవకాశముంది. జమ్మూ కాశ్మీర్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ విజయం నేపథ్యంలో ఢిల్లీలో కార్యకర్తలు టపాసులు కాలుస్తూ...
బీజేపీ
జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆరెస్ పుర నియోజకవర్గం నుండి గెలుపొందిన బీజేపీ అభ్యర్థి గగన్ భగత్ విజయచిహ్నం.
బీజేపీ
జార్ఖండ్లో బీజేపీ కూటమి 40 స్థానాలకు పైగా గెలుచుకొని, మేజిక్ ఫిగరా దాటే అవకాశముంది. జమ్మూ కాశ్మీర్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. రాంచీలో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి విజయ చిహ్నం.