బీజేపీకి బిగ్ షాక్: హోరాహోరీగా పోటీ పడి ఓడిన మెట్రోమ్యాన్ శ్రీధరన్
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. బీజేపీ తరపున పాలక్కడ్ నుంచి పోటీ చేసిన మెట్రోమ్యాన్ ఈ శ్రీధరన్ ఓటమిపాలయ్యారు. అయితే, చివరి రౌండ్ వరకు విజయం దోబూచులాడింది. 17 రౌండ్లలో ఫలితాలు వెలువడగా పలు రౌండ్లలో శ్రీధరన్ ఆధిక్యత చాటారు.
అయితే, చివరి రౌండ్లలలో పిరయిరి, మథుర్, కన్నడి పంచాయతీల ఓటర్ల మద్దతుతో పాలక్కడ్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే షఫీ పరంబిల్ విజయం సాధించారు.

పాలక్కడ్ నుంచి పోటీ చేసిన శ్రీధరన్కు ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందనే లభించింది. అంతేగాక, తాను పాలక్కడ్ నుంచి విజయం సాధిస్తానని కూడా పలు ఇంటర్వ్యూలలో ఆయన చెప్పారు. ఎమ్మెల్యే అయిన తర్వాత తాను పాలక్కడ్కే వస్తానని, ఇక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటానని చెప్పారు.
అంతేగాక, నిజయోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా కల్పిస్తానని శ్రీధరన్ చెప్పారు. పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని అన్నారు. లవ్ జిహాద్ లాంటి వాటిని అడ్డుకుంటానని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చివరకు శ్రీధరన్ ఓటమిపాలయ్యారు.
పాలక్కడ్ నియోజకవర్గంలో ఎప్పుడూ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు కంచుకోటలా ఉంటోంది. 2011 నుంచి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థే విజయం సాధిస్తున్నారు. పాలక్కడ్ మున్సిపాలిటీ బీజేపీ చేతిలోనే ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
పాలక్కడ్లో అగ్రవర్ణాల హిందువులు ఎక్కువగా ఉండటంతో శ్రీధరన్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. 2016లో తిరువనంతపురంలోని నెమమ్ సీటును మాత్రమే బీజేపీ గెలుచుకుంది. తాజా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆ ఒక్కసీటును కూడా కోల్పోయింది. ఎల్డీఎఫ్ అభ్యర్థి వీ శివం కుట్టి గెలుపొందారు.
2016లో పాలక్కడ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నేత శోభా సురేంద్రన్ పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థికి 29.08 శాతం ఓట్లు రాగా, సీపీఎంకు అభ్యర్థికి 28.07 శాతం ఓట్లు వచ్చాయి. 41.77 శాతం ఓట్లు సాధించిన యూడీఎఫ్ అభ్యర్థి షఫీ పరంబిల్ విజయం సాధించారు. కాగా, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పినరయి విజయన్ భారీ విజయాన్ని నమోదు చేశారు. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని, రెండోసారి సీఎం పదవీ చేపట్టున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications