బీజేపీ కుట్ర!, తమిళనాడులో ఆ పరిస్థితి తీసుకొచ్చేందుకే..: కుష్బూ
ప్రస్తుత అనిశ్చితి నుంచి గట్టెక్కి తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు అన్నాడీఎంకె పార్టీ బీజేపీతో కూటమి ఏర్పరుచుకున్నా.. ఆశ్చర్యపోవాల్సిందేమి లేదని కుష్బూ అన్నారు.
టీనగర్: దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత ఆ రాష్ట్రంలో పాగా వేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం అంది వచ్చిన ప్రతీ మార్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. శశికళపై పన్నీర్ సెల్వంపై తిరుగుబాటు, తాజాగా పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య సంధి చర్చలు.. ఇవన్నీ బీజేపీ చలవే అనేవారు లేకపోలేదు.
తాజాగా ఇదే విషయంపై స్పందించిన సినీ నటి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి కుష్బూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన తీసుకొచ్చేందుకే బీజేపీ ఈ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మంగళవారం నాడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆమె భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి ఈ సందర్భంగా కుష్బూ ఆయనకు వివరించారు.

ప్రస్తుత అనిశ్చితి నుంచి గట్టెక్కి తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు అన్నాడీఎంకె పార్టీ బీజేపీతో కూటమి ఏర్పరుచుకున్నా.. ఆశ్చర్యపోవాల్సిందేమి లేదని కుష్బూ అన్నారు. అయితే దొడ్డిదారిన తమిళనాడులో పాగా వేయాలని ప్రయత్నిస్తే.. బీజేపీకి కలలే మిగులుతాయన్నారు.
డీఎంకె ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ సైతం బీజేపీపై ఇవే వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ పగటి కలలు ఫలించబోవన్నారు. రాష్ట్ర రైతుల 19డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చాలంటూ డీఎంకె చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమైందన్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications