BJP vs SP: సన్యాసి సీఎం ఎందుకు అన్నారు, సంసారి సీఎం ఎందుకు ?, మోదీ, యోగీ దెబ్బతో మైండ్ బ్లాక్ !
లక్నో/వారణాసి: దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో కొన్ని పార్టీల నాయకులు విజయం మాదే అంటూ ధీమాగా ఉంటున్నారు. ఇంక కొన్ని నియోజక వర్గాల్లో వెనుకపడిన నాయకులు ఎక్కడో తేడా వచ్చింది అంటూ నాలుక కరుచుకుంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అందరి కళ్లు ఉత్తరప్రదేశ్ మీదే పడ్డాయి. ఉత్తరప్రదేశ్ తరువాత పంజాబ్ హాట్ టాపిక్ అయ్యింది. పంజాబ్ లో అధికార పార్టీ కాంగ్రెస్ ను చీపురల్లో ఊడ్చేస్తున్న అమ్ ఆద్మీ పార్టీ నాయకులు పంజాబ్ గడ్డ మీద పాగా వెయ్యడానికి సిద్దం అవుతున్నారని వారి దూకుడు చూస్తే అర్థం అవుతోంది. భారతదేశంలోనే ఎక్కువ అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్న ఉత్తరప్రదేశ్ లో అయితే అధికార పార్టీ బీజేపీ మరోసారి అధికారంలోకి రావడానికి సిద్దం అయ్యింది. ఉత్తరప్రదేశ్ లో మొదటి నుంచి 200కు పైగా నియోజక వర్గాల్లో బీజేపీ దూసుకుపోతోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లోని 50 శాతం నియోజక వర్గాల్లో ముందంజలో ఉన్న బీజేపీ ఎన్నికల ఫలితాలు పూర్తి అయ్యే సమాయానికి ఎన్ని నియోజక వర్గాలను కైవసం చేసుకుంటుందో వేచి చూడాలి. ఉత్దరప్రదేశ్ లో అధికార పార్టీ బీజేపీ తరువాత ప్రధాన పోటీ అయిన ఎస్పీ నాయకులు కొన్ని నియోజక వర్గాల్లో ముందంజలో ఉన్నారు. ఇక మిగిలిన పార్టీల నాయకులు ఏదో అలాఅలా ఇటూఅటూ అంటూ ఊగిసలాడుతున్నారు. సన్యాసి సీఎం ఏమిటి, ఈ రాష్ట్రం ఏమైపోతుంది అంటూ ఇంతకాలం విమర్శలు, ఎద్దేవ చేసిన ప్రతిపక్షాలకు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దెబ్బతో చక్కలు కనపడుతున్ననాయని బీజేపీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. అయితే ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కొట్టిన దెబ్బకు ఎస్పీతో పాటు కాంగ్రెస్ పార్టీకి సినిమా కనపడింది. ఐదు సంవత్సరాలు నోరు ఎత్తకుండా చేసిన బీజేపీ ఉత్తరప్రదేశ్ లో సత్తా చాటుకుంది.
Recommended Video

ఎవరి ధీమా వాళ్లదే
దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో కొన్ని పార్టీల నాయకులు విజయం మాదే అంటూ ధీమాగా ఉంటున్నారు. ఇంక కొన్ని నియోజక వర్గాల్లో వెనుకపడిన నాయకులు ఎక్కడో తేడా వచ్చింది అంటూ నాలుక కరుచుకుంటున్నారు.

హాట్ టాపిక్ యూపీ
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అందరి కళ్లు ఉత్తరప్రదేశ్ మీదే పడ్డాయి. ఉత్దరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం నుంచి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ జోరుగా జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ తరువాత పంజాబ్ హాట్ టాపిక్ అయ్యింది.

పంజాబ్ లో పంజా విసిరిన ఆప్
పంజాబ్ లో అధికార పార్టీ కాంగ్రెస్ ను చీపురల్లో ఊడ్చేస్తున్న అమ్ ఆద్మీ పార్టీ నాయకులు పంజాబ్ గడ్డ మీద పాగా వెయ్యడానికి సిద్దం అవుతున్నారని వారి దూకుడు చూస్తే అర్థం అవుతోంది. పంజాబ్ లో ఇంతకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతర్గత కుమ్ములాటను ఆప్ సద్వినియోగం చేసుకోవడంతో పూర్తిగా సక్సస్ అయ్యిందని వెలుగు చూస్తోంది.

దూసుకుపోతున్న బీజేపీ
భారతదేశంలోనే ఎక్కువ అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్న ఉత్తరప్రదేశ్ లో అయితే అధికార పార్టీ బీజేపీ మరోసారి అధికారంలోకి రావడానికి సిద్దం అయ్యింది. ఉత్తరప్రదేశ్ లో మొదటి నుంచి 200కు పైగా నియోజక వర్గాల్లో బీజేపీ దూసుకుపోతోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లోని 50 శాతం నియోజక వర్గాల్లో ముందంజలో ఉన్న బీజేపీ ఎన్నికల ఫలితాలు పూర్తి అయ్యే సమాయానికి ఎన్ని నియోజక వర్గాలను కైవసం చేసుకుంటుందో వేచి చూడాలి.

నువ్వానేనా అంటే నేనే అంటున్న బీజేపీ
ఉత్దరప్రదేశ్ లో అధికార పార్టీ బీజేపీ తరువాత ప్రధాన పోటీ అయిన ఎస్పీ నాయకులు కొన్ని నియోజక వర్గాల్లో ముందంజలో ఉన్నారు. ఇక మిగిలిన పార్టీల నాయకులు ఏదో అలాఅలా ఇటూఅటూ అంటూ ఊగిసలాడుతున్నారు. 184 నియోజక వర్గాల్లో బీజేపీ నాయకులు భారీ మెజారిటీతో దూసుకుపోతుంటే 70 సీట్లలో ఎస్పీ ముందంజలో ఉంది. ఇక మిగిలిన పార్టీలు కాస్తో కూస్తో ఓట్లు సంపాధించారి వెలుగు చూస్తా ఉంది.

సన్యాసి సీఎం ఏమిటిని విమర్శలు చేసిన ప్రతిపక్షాలు
సన్యాసి సీఎం ఏమిటి, ఈ రాష్ట్రం ఏమైపోతుంది అంటూ ఇంతకాలం విమర్శలు, ఎద్దేవ చేసిన ఉత్తకప్రదేశ్ లోని ప్రతిపక్షాలకు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దెబ్బతో చక్కలు కనపడుతున్ననాయని బీజేపీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. సన్యాసి అయితే ఏమిటి ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ది చేశారు కదా అంటూ ఇంతకాలం బీజేపీ నాయకులు ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి దిగారు.

పని చెయ్యని సన్యాని, సంసారి మంత్రం
సన్యాసి అయినా, సంసారి అయినా పర్వాలేదని, మాకు మారాష్ట్రం, మాత్రం అభివృద్ది ముఖ్యం అని అనుకున్న ఓటర్లు బీజేపీకి ఊహించని విధంగా అండగానిలిచారని ఓట్ల లెక్కింపు చూస్తే అర్థం అవుతోంది. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్కెచ్ కు ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు చిత్తుచిత్తు అవుతున్నాయని వెలుగు చూస్తోంది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications