మళ్లీ మాదే అధికారం, మిగిలిన అవినీతిని తుడిచేస్తాం: సుబ్రహ్మణ్య స్వామి
న్యూయార్క్: వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి.. భవిష్యత్ రాజకీయంపై జోస్యం చెప్పారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికార పగ్గాలు చేపడుతుందని అన్నారు.
దేశంలో ఇంకా మిగిలిపోయిన అవినీతి మరకలను రెండో విడుతలో బీజేపీలో తుడిచిపెడుతుందని అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొలంబియా బిజినెస్ స్కూల్ 14వ వార్షిక భారత వాణిజ్య సదస్సులో పాల్గొనేందుకు ఆయన అమెరికా వెళ్లారు.
ఇక ప్రధాని గురించి ప్రస్తావిస్తూ.. మోడీకి ఉన్న ప్రతిష్టతో పాటు దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన పోరాటం తమకు కలిసొచ్చే అంశమని అన్నారు. కులాలకు అతీతంగా బీజేపీకి ఓటు వేయాలన్న ఆకాంక్ష హిందువుల్లో పెరిగిందని అన్నారు. మైనారిటీలకు తాము వ్యతిరేకం కాదని, పటిష్ట ఐక్య భారత్ నిర్మాణమే తమ లక్ష్యమని వివరించారు.