వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లధనంపై ముందడుగు: రూ.9003 కోట్ల ఆస్తుల జఫ్తు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నల్లధనం విషయంలో ఓ ముందడుగు. నల్లధనం దాచిన వారు, నల్లధనం చలామణి చేసిన వారి పైన 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 173 ఛార్జీషీట్లను దాఖలు చేసింది. రూ.9003 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జఫ్తు చేసింది.

2013-14 ఏడాదితో పోలిస్తే జఫ్తు చేసిన ఆస్తుల సంఖ్యలో 400 శాతం పెరుగుదల ఉంది. క్రిమినల్ ఎఫ్ఐఆర్‌ల నమోదు సంఖ్యలో ఐదు వంతల శాతానికి పైగా పెరుగుదల ఉంది. నల్లధనం చలామణిలో ప్రమేయం ఉన్న వారి అరెస్టుల్లో ఆరువందల శాతం పెరుగుదల ఉంది.

Black money: ED freezes properties worth Rs 9003 crore, files 173 chargesheets

ప్రాసిక్యూషన్ ఫిర్యాదుల దాఖలులో లేదా ఛార్జీషీటు దాఖలులో రెండువందల శాతం పెరుగుదల నమోదయింది. సంబంధిత నివేదికను నల్లధనంపై సుప్రీం కోర్టుకు నియమించిన ప్రత్యేక దర్యాఫ్తు బృందానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఈడీ సమర్పించింది.

కాగా, నల్లధనం చలామణి కేసులు రికార్డ్ స్థాయిలో నమైదయ్యాయి. స్విట్జర్లాండ్ నల్లధనం చలామణి వివరాల నమోదు కార్యాలయం విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం తెలిసిందే. స్విట్జర్లాండులో 2014లో నల్లధనం చలామణికి సంబంధించి తమకు అందిన అనుమానిత కార్యకలాపాల నివేదిక సంఖ్య 1753గా ఉన్నట్లు పేర్కొంది. 2011లో ఈ సంఖ్య 1625గా ఉంది.

English summary
In a major action against black money hoarders and money launderers, the Enforcement Directorate (ED) has attached assets to the tune of Rs 9,003 crore and filed 173 charge sheets in the financial year 2014-15.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X