వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉత్తరప్రదేశ్ లో బాంబు పేలుడు: రైల్వే ట్రాక్ పక్కనే నాలుగు బాంబులు సీజ్ !
ఉత్తరప్రదేశ్ లోని సంత కబీర్ నగర్ లోని రైల్వే ట్రాక్ సమీపంలో మంగళవారం ఉదయం బాంబు పేలిపోవడంతో స్థానికులు హడలిపోయారు. రైల్వే ట్రాక్ సమీపంలో నాలుగు నాటు బాంబులను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని సంత కబీర్ నగర్ లోని రైల్వే ట్రాక్ సమీపంలో మంగళవారం ఉదయం బాంబు పేలిపోవడంతో స్థానికులు హడలిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
రైల్వే ట్రాక్ సమీపంలో నాలుగు నాటు బాంబులను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే ట్రాక్ సమీపంలో తక్కువ సామర్థ్యం ఉన్న నాటు బాంబు పేలిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
విషయం తెలుసుకున్న ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే ఇది ఉగ్రవాదుల దాడికాదని అధికారులు అంటున్నారు. స్వాధీనం చేసుకున్న నాటు బాంబులను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
Comments
uttar pradesh railway track bomb blast police up ఉత్తరప్రదేశ్ రైల్వే ట్రాక్ బాంబు పేలుడు పోలీసు యూపీ
English summary
A minor intensity blast has been reported near a railway track at the Sant Kabir Nagar in Uttar Pradesh.
Story first published: Tuesday, March 28, 2017, 12:14 [IST]