వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నితీశ్ సభకు సమీపంలో పేలుడు.. కేవలం 20 ఫీట్ల దూరంలో బ్లాస్ట్.. సేఫ్

|
Google Oneindia TeluguNews

బీహర్ సీఎం నితీశ్ కుమార్ తృటిలో తప్పించుకున్నారు. ఆయన సభ వేదికకు కూతవేటు దూరంలో పేలుడు జరిగింది. అయితే అదీ బాణాసంచా కావడంతో భద్రతా సిబ్బంది పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన నితీశ్ సొంత జిల్లా నలందలో గల సిలావ్‌లో మంగళవారం జరిగింది. నితీష్ స్టేజీకి కేవలం 20 ఫీట్ల దూరంలో పేలుడు సంభవించింది.

సొంత జిల్లాలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు నితీశ్ కుమార్ వచ్చారు. బహిరంగ సభ వేదికపై ఆశీనులు అయ్యారు. ఇంతలో స్వల్పంగా పేలుడు జరిగింది. ఘటనకు సంబంధించి పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పేలుడు పదార్థం బాణా సంచా, అగ్గిపెట్టేను కూడా స్వాధీనం చసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరుగుతుందని వారు తెలియజేశారు.

blast reported close to Bihar CM Nitish Kumar’s stage

గత నెలలో బక్తియపూర్‌లో కూడా బహిరంగ సభలో ఇలాంటి ఘటన జరిగింది. అయితే ఆ సమయంలో సీఎం నితీశ్ కుమార్‌పై ఓ యువకుడు దాడి చేసేందుకు యత్నించారు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మరవక ముందే తాజాగా మరొటి జరిగింది. బాంబు దాడి ఘటనతో నితీశ్​ కుమార్‌ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే వార్తలకు బలం చేకూర్చినట్టయింది. వరసగా రెండోసారి యత్నించడంతో సీరియస్ నెస్ అర్థం అవుతుంది.

English summary
low intensity blast was reported close to the stage where Bihar CM Nitish Kumar was present bihar nalanda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X