శతాబ్ది ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు: ఆగిన రైళ్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ - కాన్పూర్ రైలులో బాంబు ఉందన్న సమాచారంతో పోలీసులు ఆదివారం నాడు తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీ - కాన్పూర్ రైలులో బాంబు ఉందని మహారాష్ట్ర రాజధాని ముంబై ఏటీఎస్ పోలీసులకు ఈ మెయిల్ వచ్చింది.
ముంబై ఏటీఎస్ పోలీసుల సమాచారంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీలతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ-లక్నో శతాబ్ది ఎక్స్ప్రెస్ను ఘజియాబాద్లో నిలిపివేసి డాగ్ స్క్వాడ్తో క్షుణ్నంగా తనిఖీ చేశారు.

రైలులో బాంబులేదని నిర్ధారించిన అనంతరం శతాబ్ది ఎక్స్ప్రెస్ను పంపించారు. కాగా, పోలీసుల తనిఖీల వల్ల పలు రైళ్లు ఉత్తరాదిన ఆలస్యంగా నడిచాయి. అహ్మదాబాద్, కోల్కతా తదితర ప్రాంతాల నుంచి బలుదేరాల్సిన రైళ్లలో కూడా సోదాలు నిర్వహించారు.
బీజాపూర్ జిల్లాలో ముగ్గురు యువకుల అపహరణ
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని బార్కగూడలో ముగ్గురు యువకులు అపహరణకు గురైన ఘటన కలకలం సృష్టించింది. పుణె నుంచి వచ్చిన యువకులను మావోయిస్టులు అపహరించారు. గడ్చిరోలి నుంచి ఒడిశాలోని మల్కన్గిరి వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించాలని యువకులు తలపెట్టగా మార్గ మధ్యంలో ఈ ఘటన జరిగింది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications