Mohammed Siraj: మహ్మద్ సిరాజ్ భావోద్వేగ పోస్ట్.. మిస్ యూ పాపా అంటూ షేర్ చేసిన బౌలర్..
భారత క్రికెట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఆసియాకప్ లో రాణించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆసియా కప్ ఫైనల్ లో శ్రీలంకపై అద్భుత ప్రదర్శన చేశాడు. ఆరు వికెట్లు తీసి శ్రీలంకను కుప్పకూల్చాడు. మహ్మద్ సిరాజ్ ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో 694 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 9వ స్థానంలో అతను ఏకంగా 8 స్థానాలు ఎగబాకి మొదటి స్థానానికి వచ్చాడు. మహ్మద్ సిరాజ్ వన్డే బౌలింగ్ ర్యాకింగ్స్ లో నంబర్ వన్ గా నిలవడం ఇది రెండోసారి.
ఈ సంవత్సరం జనవరిలో అతను అగ్రస్థానంలో నిలిచాడు. అయితే రెండు నెలల తర్వాత ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజల్ వుడ్ సిరాజ్ దాటి మొదటి స్థానం దక్కించుకున్నాడు. ఇప్పుడు సిరాజ్ మళ్లీ హాజల్ వుడ్ ను అధికమించి మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. శ్రీలంకపై కాకుండా పాకిస్థాన్ పై కూడా మహ్మద్ సిరాజ్ మంచి ప్రదర్శనే చేశాడు. బౌలింగ్ లో మొదటి స్థానంలో నిలిచిన సందర్భంగా మహ్మద్ సిరాజ్ ఇన్ స్టాగ్రామ్ లో భావోద్వేగంగా ఓ పోస్టు చేశాడు. కొన్ని రోజుల కింద తనిపోయిన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ పోస్ట్ పెట్టాడు.

ఆ తర్వాత దేశావాలీ, ఐపీఎల్ లో రాణించి జాతీయ జట్టు మళ్లీ స్థానం సంపాదించాడు. 2020-21 బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన చేశాడు. తండ్రి మరణించినా స్వదేశానికి రాకుండా ఆడాడు. ఇదే విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. సిరాజ్ కష్టపడి ఈ స్థాయికి చేరడాని కామెంట్ చేస్తున్నారు. నిజానికి సిరాజ్ క్రికెటర్ గా ఎదగడానికి చాలా కష్టపడ్డాడు. తనకు షూస్ లేక చెప్పులతోనే బౌలింగ్ చేశాడు.












Click it and Unblock the Notifications